Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak41cc101f-921e-45d3-920e-9341bb35b68e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak41cc101f-921e-45d3-920e-9341bb35b68e-415x250-IndiaHerald.jpgఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ సమయాల్లో కూడా ఏకంగా యుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్రీడల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఏకంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రీడా సంబంధాలపై కూడా నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇరుజట్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగడం అస్సలు చూడలేం. అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ వేదికగా జరుగుతూ ఉండడంతో ఇక భారత జట్టు అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తూ వస్తpak{#}BCCI;Pakistan;Cricket;Indiaబిసిసిఐపై కేసు పెట్టబోతున్న పాక్.. ఎందుకో తెలుసా?బిసిసిఐపై కేసు పెట్టబోతున్న పాక్.. ఎందుకో తెలుసా?pak{#}BCCI;Pakistan;Cricket;IndiaMon, 11 Nov 2024 10:45:00 GMTఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ సమయాల్లో కూడా ఏకంగా యుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్రీడల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఏకంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రీడా సంబంధాలపై కూడా నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇరుజట్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగడం అస్సలు చూడలేం.


 అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ వేదికగా జరుగుతూ ఉండడంతో ఇక భారత జట్టు అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తూ వస్తుంది. మొన్నటికి మొన్న ఆసియా కప్ నిర్వహణ సమయంలో కూడా తాము పాకిస్తాన్ వెళ్లే ప్రసక్తే లేదని.. కాదు కూడదు అంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని.. లేదంటే తటస్థ వేదికపై భారత్ ఆడే మ్యాచ్ లో నిర్వహించాలని ప్రతిపాదన పెట్టగా.. ఇందుకు ఎసిసి కూడా అంగీకరించి ఇక తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహించింది. కాగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. అయితే ఈ ఐసీసీ టోర్నీకి కూడా పాకిస్తాన్ వెళ్లేందుకు అటు బీసీసీఐ ఇప్పటికే నిరాకరించింది.


 తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహిస్తేనే తాము ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాము అంటూ తేల్చేసింది. అయితే ఇక ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఉంది. ఇలా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించిన నేపథ్యంలో తమ మ్యాచ్లను దుబాయిలో ఆడేలా హైబ్రిడ్ షెడ్యూల్ ను పిసిబికి బీసీసీఐ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీంతో ఆర్బిటేషన్ కోర్టును ఆశ్రయించాలని పాకిస్తాన్ నిర్ణయించుకుందట. తమ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోని ఒక్క మ్యాచ్ ను కూడా ఇతర వేదికలకు తరలించే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహసిన్ నక్వి తేల్చి చెప్పారు. ఏం జరగబోతుందో చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమాకి నాకంటే జ్యోతిక పారితోషకం అన్నిరెట్లు ఎక్కువ.. సూర్య..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>