EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp8de75a8f-0bc8-4a95-8222-607af04386bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp8de75a8f-0bc8-4a95-8222-607af04386bb-415x250-IndiaHerald.jpgఅనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పెద్దలు అంటారు. వైసీపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. గతంలో చేసిన తప్పుడు ప్రయోగాలకు స్వస్తి అంటోంది. ఇంతకీ వైసీపీ చేసింది ఏంటి, ఏమి చేయబోతోంది అంటే ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటరే మరి. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు ఏకంగా 151 సీట్ల భారీ మెజారిటీతో. దీంతో 2024 లఒ ఒక పెద్ద ప్రయోగాన్ని చేసింది. మొత్తం 80కి పైగా అసెంబ్లీ సీట్లలో కొత్త వారిని పోటీకి దించింది. ఆ కొత్త వారు ఎవరో కాదు వేరే నియోజకవర్గాల నుంచి తెచ్చి అక్కడ వారిని పోటీకి ycp{#}Assembly;Hanu Raghavapudi;YCP;Partyవైసీపీ బలోపేతానికి మాస్టర్ ప్లాన్ వేసిన జగన్? మళ్ళీ పాత నాయకులంతా వెనక్కి?వైసీపీ బలోపేతానికి మాస్టర్ ప్లాన్ వేసిన జగన్? మళ్ళీ పాత నాయకులంతా వెనక్కి?ycp{#}Assembly;Hanu Raghavapudi;YCP;PartyMon, 04 Nov 2024 09:32:00 GMTఅనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పెద్దలు అంటారు. వైసీపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. గతంలో చేసిన తప్పుడు ప్రయోగాలకు స్వస్తి అంటోంది.  ఇంతకీ వైసీపీ చేసింది ఏంటి, ఏమి చేయబోతోంది అంటే ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటరే మరి.  వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. అలా ఇలా కాదు ఏకంగా 151 సీట్ల భారీ మెజారిటీతో.


దీంతో 2024 లఒ ఒక పెద్ద ప్రయోగాన్ని చేసింది. మొత్తం 80కి పైగా అసెంబ్లీ సీట్లలో కొత్త వారిని పోటీకి దించింది.  ఆ కొత్త వారు ఎవరో కాదు వేరే నియోజకవర్గాల నుంచి తెచ్చి అక్కడ వారిని పోటీకి పెట్టారు. ఎన్నికల ముందు ఈ ట్రాన్స్ ఫర్లు అన్నీ బెడిసికొట్టాయి. ఎవరికీ పట్టు దక్కకుండా పోయింది. చివరికి ఘోరంగా ఓటమి పాలు అయ్యారు.



వైసీపీ అధినాయకత్వం ఇపుడు మనసు మార్చుకుంది. పాత వారిని వారి సొంత నియోజకవరాలను పంపిస్తోంది. పాత వారికే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తే వారు చక్కగా పనిచేసుకోగలుగుతారని అది అంతిమంగా వైసీపీకి ఉపయోగపడుతుందని ఆలోచిస్తోంది. దీంతో పాత వారు అంతా ఫుల్ హ్యాపీస్ అని అంటున్నారు.   ఎన్నికల్లో ఓడిన తరువాత తమను ట్రాన్స్ ఫర్ చేసిన సీట్లలోకి ఎవరూ వెళ్లలేదు. దాంతో అక్కడ పార్టీ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది.


తాజాగా వైసీపీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయంతో వారు ఆయా చోట్ల తమ సత్తా చాటేందుకు ఉత్సాహం చూపుతారు అని అంటున్నారు. ఇపుడు వారి పనితీరు బేరీజు వేసుకుని ఎన్నికల వేళకు ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే అపుడు చూసుకోవచ్చు అన్నది హై కమాండ్ ఆలోచనగా ఉందంట.


వైసీపీ జిల్లాలలో కొన్ని చోట్ల అధ్యక్షులను పెండింగులో పెట్టింది. ముందు ఆ నియామకాలు పూర్తి చేసిన తరువాత వరసబెట్టి నియోజకవర్గాల ఇంచార్జిలను ప్రకటిస్తారు అని అంటున్నారు. వీరంతా దాదాపుగా 2019 నుంచి 2024 మధ్యలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే ఆయా సీట్లలో ఉంటారు అని అంటున్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందరికీ కడుపునిండా అన్నం పెట్టే ప్రభాస్.. సిగ్గు పడకుండా కంచెం నాకేసేది ఆ ఒక్క స్టార్ ఇంట్లోనే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>