PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/these-are-the-three-new-rajya-sabha-members-in-the-coalition67bfd653-fb7b-4408-85a5-d73135f0be51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/these-are-the-three-new-rajya-sabha-members-in-the-coalition67bfd653-fb7b-4408-85a5-d73135f0be51-415x250-IndiaHerald.jpgవైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ - బీదా మస్తాన్ రావు తాజాగా ఆర్ . కృష్ణయ్య కూడా తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖాళీ అయిన ఈ మూడు స్థానాలలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు. Rajya Sabha {#}Telugu Desam Party;Government;Minister;TDP;Nagababu;CBN;Janasena;MP;Newsకూట‌మిలో ముగ్గురు కొత్త రాజ్య‌స‌భ స‌భ్యులు వీళ్లే... !కూట‌మిలో ముగ్గురు కొత్త రాజ్య‌స‌భ స‌భ్యులు వీళ్లే... !Rajya Sabha {#}Telugu Desam Party;Government;Minister;TDP;Nagababu;CBN;Janasena;MP;NewsSun, 29 Sep 2024 08:37:20 GMTఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటేసింది. ఈ క్రమంలోనే అనుకోకుండా వైసిపి కి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడంతో ఈ మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు స్థానాలు కూడా కూటమికే దక్కనున్నాయి. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ - బీదా  మస్తాన్ రావు తాజాగా ఆర్ . కృష్ణయ్య కూడా తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖాళీ అయిన ఈ మూడు స్థానాలలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తులు మొదలుపెట్టారు.


విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం రెండుసార్లు గుంటూరు నుంచి ఎంపీగా గెలిచి ఎన్నికలలో సీటు వదులుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఒక‌టి ... కేంద్ర మాజీ మంత్రి విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు మరొకటి ... అలాగే జనసేన నుంచి నాగబాబుకు మూడో రాజ్యసభ స్థానం ఇవ్వాలని నిర్ణయానికి చంద్రబాబు దాదాపు వచ్చారని తెలుస్తోంది. ఈ ముగ్గురికి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉంటుంది. ఇక నాగబాబు రాజ్యసభకు ఎంపిక అయితే జనసేన నుంచి రాజ్యసభకు ఎంపికైన తొలి ఎంపిగా ఆయన పేరు రికార్డుల్లో నిలిచిపోతుంది.


ఇక ఎంపీ ప‌ద‌వులు వ‌దులుకున్న వారిలో మోపి దేవి వెంక‌ట ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని టాక్ ? ఆయ‌న‌కు ఎమ్మెల్సీ తో పాటు పార్టీలోనూ కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌నున్నారు. ఇక బీద మ‌స్తాన్ రావుకు త‌ర్వాత ఏదో ఒక ప‌ద‌వి ఇస్తార‌ని అంటున్నారు. ఆయ‌న గ‌తంలో నెల్లూరు జిల్లా కావ‌లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న వైసీపీలోకి వెళ్లి రాజ్య‌స‌భ ఎంపీ అయ్యారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>