PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jaganfdb40e5a-2e1d-4ee7-93a0-d167e87ec80b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jaganfdb40e5a-2e1d-4ee7-93a0-d167e87ec80b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డులో... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జంతువుల కొవ్వును కలిపిందని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడం వివాదంగా మారిపోయింది. ఈ రచ్చ ప్రస్తుతం దేశవాప్తంగా కొనసాగుతోంది. హిందూ సంఘాలు అలాగే తెలుగుదేశం కూటమి పార్టీలు ఏకమై.. జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేస్తున్నాయి. jagan{#}Ladoo;Bharatiya Janata Party;Telugu Desam Party;Jagan;Andhra Pradesh;Tirupati;Prime Minister;Raccha;Reddy;CBN;Telangana Chief Minister;Successజగన్ ఇంటికి కాషాయ రంగు..?జగన్ ఇంటికి కాషాయ రంగు..?jagan{#}Ladoo;Bharatiya Janata Party;Telugu Desam Party;Jagan;Andhra Pradesh;Tirupati;Prime Minister;Raccha;Reddy;CBN;Telangana Chief Minister;SuccessMon, 23 Sep 2024 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డులో... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జంతువుల కొవ్వును కలిపిందని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడం వివాదంగా మారిపోయింది. ఈ రచ్చ ప్రస్తుతం దేశవాప్తంగా కొనసాగుతోంది. హిందూ సంఘాలు అలాగే తెలుగుదేశం కూటమి పార్టీలు ఏకమై.. జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేస్తున్నాయి.

 
అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి.. కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా... పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. సున్నితమైన హిందువుల అంశం కావడం... జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి సంబంధించిన వాడు కావడంతో..  అందరూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు నిజమేనని అనుకుంటున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవ ఉన్నదో తెలియదు కానీ...  జగన్మోహన్ రెడ్డికి మాత్రం చిక్కులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వివాదం ఇప్పుడు  జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చేసింది.

 

తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించేశారు హిందూ సంఘాల నేతలు, బిజెపి కార్యకర్తలు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు జగన్ అక్కడే ఉన్నారు. అయితే ఆ ఇంటి ముందు బిజెపి కార్యకర్తలు అలాగే హిందూ సంఘాలు నేతలు నిరసనకు దిగారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాషాయ రంగు పూశారు. అక్కడితో ఆగకుండా బిజెపి జెండాలు... జగన్ ఇంటికి కట్టడం జరిగింది.

 

హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి.. గోవిందా గోవిందా అంటూ  నినాదాలు కూడా చేశారు బిజెపి నేతలు. అయితే... ఇంత జరుగుతున్న ఏపీ పోలీసులు మాత్రం చేతులు కట్టుకొని నిల్చున్నారు.వారు ఎవరిని అరె స్టు చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈ అంశం చాలా వివాదంగా మారింది.  ఇది ఇలా ఉండగా తిరుమల లడ్డు వివాదం పై.. ప్రధాని నరేంద్ర మోడీ కి... జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>