Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kudumulu33127714-5828-4c09-a410-bb688db35074-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kudumulu33127714-5828-4c09-a410-bb688db35074-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరూ కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వినాయక చవితి రోజు రానే వచ్చింది. హిందువులందరూ జరుపుకునే పెద్ద పండుగలో గణేష్ చతుర్థి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. వినాయక చవితి వచ్చింది అంటే చాలు ఊరువాడ అంతట పండగ శోభ సంతరించుకుంటూ ఉంటుంది. ఇక చిన్నపిల్లల దగ్గర నుంచి యువకులు పెద్దల వరకు అందరూ కూడా ఏకంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకొని వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకుంటూ ఉంటారు. తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ప్రతిరోజు కూడా ఆ గణనాథుడికkudumulu{#}Aaviri;Ganesh Chaturthiగణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్ళు పెట్టడం వెనక.. సైంటిఫిక్ రీజన్ ఉందా?గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్ళు పెట్టడం వెనక.. సైంటిఫిక్ రీజన్ ఉందా?kudumulu{#}Aaviri;Ganesh ChaturthiSat, 07 Sep 2024 10:00:00 GMTదేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరూ కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వినాయక చవితి రోజు రానే వచ్చింది. హిందువులందరూ జరుపుకునే పెద్ద పండుగలో గణేష్ చతుర్థి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. వినాయక చవితి వచ్చింది అంటే చాలు ఊరువాడ అంతట పండగ శోభ సంతరించుకుంటూ ఉంటుంది. ఇక చిన్నపిల్లల దగ్గర నుంచి యువకులు పెద్దల వరకు అందరూ కూడా ఏకంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకొని వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకుంటూ ఉంటారు. తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ప్రతిరోజు కూడా ఆ గణనాథుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తూ.. ఇక పూజలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే వినాయక చవితి వచ్చినప్పుడల్లా గణేశుడుకి సమర్పించే నైవేద్యాలలో కుడుములు ఉండ్రాళ్లు తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఈ రెండు కూడా అటు గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలు అని చెబుతూ ఉంటారు. అయితే పురాణాల్లో కూడా ఈ రెండు రకాల ఆహార పదార్థాల గురించి ప్రస్తావించారు అని చెప్పాలి. అయితే పెద్దలు ఏది చేసినా దాని వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే వినాయక చవితి సందర్భంగా ఇలా గణనాథునికి కుడుములు ఉండ్రాళ్ళు లాంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడం వెనుక కూడా ఇలాంటి సైంటిఫిక్ రీసన్ ఒకటి ఉందట.


 ఈ దక్షిణాయన కాలంలో మనుషుల్లో జీవక్రియ నెమ్మదిగా ఉంటుందట. అరుగుదల ఆకలి రెండు పెద్దగా ఉండవట. ఈ నేపథ్యంలో బియ్యం పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు తేలికగా అరగడమే కాక.. శరీర ఆరోగ్యాన్ని, శక్తిని కూడా పెంచుతాయట. అందుకే ఇక వినాయక చవితి నాడు ఇలా జీర్ణక్రియను మరింత నెమ్మదించేలా చేసే ఆహారాలు కాకుండా ఇక త్వరగా అరిగిపోయి.. శరీరానికి శక్తినిచ్చే ఆహారాలను తినేందుకు వీలుగానే వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు లాంటివి నైవేద్యాలుగా పెట్టడమే కాదు అందరికీ వీటిని ప్రసాదంగా కూడా పంచుతూ ఉంటారని పెద్దలు చెప్పే మాట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>