PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nellore-penna-river-ritaining-wall-ap-61816a7e-3d01-4528-a991-e2383d21a2da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nellore-penna-river-ritaining-wall-ap-61816a7e-3d01-4528-a991-e2383d21a2da-415x250-IndiaHerald.jpgపెన్నా నది ఎప్పుడైతే ఉగ్రరూపం దాలుస్తుందో అప్పుడు నది తీర ప్రాంతాల్లోని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. భగత్ సింగ్ కాలనీ ప్రజలు భయపడుతూ ఉంటారు. అంతేకాదు నది సమీపంలో కట్టుకున్న ఇండ్లన్నీ ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, ఒర్లుకట్ట ప్రాంతాలు ఎప్పటికప్పుడు కోతకు గురవుతూ వాటర్ ఇండ్లలోకి చేరుతుంది. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఈ ప్రాంతమంతా జలదిగ్బంధంలో కూరుకు పోతుంది. అధికారులు వచ్చి చూసి వెళ్లడం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు వెతిNELLORE; PENNA RIVER; RITAINING WALL; AP {#}Nellore;Minister;YCP;Penna River;Reddy;Governmentనెల్లూరును వణికిస్తున్న పెన్నా..పట్టించుకునే వారే లేరా.?నెల్లూరును వణికిస్తున్న పెన్నా..పట్టించుకునే వారే లేరా.?NELLORE; PENNA RIVER; RITAINING WALL; AP {#}Nellore;Minister;YCP;Penna River;Reddy;GovernmentThu, 05 Sep 2024 10:22:05 GMT-పెన్నాతో నెల్లూరుకు ఇబ్బందులు.
-వరదలు వస్తే వణుకుతున్న ప్రజలు.


 నెల్లూరు జిల్లా పేరు చెప్పగానే చాలామందికి పెన్నా నది గుర్తిస్తుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు నెల్లూరు జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. పెన్నా నది ఉగ్రరూపం దాలిస్తే  ప్రజల బతుకులు బుగ్గిపాలవుతాయి. ఎప్పుడొచ్చి వరద మీద పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో వారు బతుకుతూ ఉంటారు. అలాంటి పెన్నా నది  గురించి కొన్ని వివరాలు చూద్దాం

 పెన్నా పరేషాన్ :
పెన్నా నది ఎప్పుడైతే ఉగ్రరూపం దాలుస్తుందో అప్పుడు నది తీర ప్రాంతాల్లోని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. భగత్ సింగ్ కాలనీ  ప్రజలు భయపడుతూ ఉంటారు. అంతేకాదు నది సమీపంలో కట్టుకున్న ఇండ్లన్నీ ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, ఒర్లుకట్ట ప్రాంతాలు ఎప్పటికప్పుడు కోతకు గురవుతూ వాటర్ ఇండ్లలోకి చేరుతుంది. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఈ ప్రాంతమంతా జలదిగ్బంధంలో కూరుకు పోతుంది. అధికారులు వచ్చి చూసి వెళ్లడం తప్ప  ప్రత్యామ్నాయ మార్గాలు వెతికిన పరిస్థితి అయితే కనిపించడం లేదు.  అయితే గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు పెన్నా నదిపై ప్రహరీ గోడ నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. 

 మొత్తం 95 కోట్లతో ప్రహరీ గోడ నిర్మించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి పనులు కూడా మొదలుపెట్టారు అప్పటి జలవనరుల  శాఖ మంత్రి అంబటి రాంబాబు. పెన్నా నది తీర ప్రాంతంలో  ఈ ప్రహారి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పెన్నా నదిపై బ్యారేజీ పనులు  ఇప్పటికే పూర్తయిపోయాయి. అంతేకాదు ఈ బ్యారేజ్ నుంచి రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి.  ఈ తరుణంలోనే భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం ప్రాంతాల ప్రజలను కాపాడుకునేందుకు రిటైనింగ్ వాల్ కూడా వైసిపి ప్రభుత్వం పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వర్షాకాలం వచ్చిందంటే నెల్లూరు ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతకాల్సిందే, వరదల నుంచి వీరిని కాపాడుకునేందుకు ఈ ప్రభుత్వం ఇంకేమైనా పనులు చేస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>