PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpebe7ce73-fe9d-4d08-8078-366ff360f7d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpebe7ce73-fe9d-4d08-8078-366ff360f7d2-415x250-IndiaHerald.jpgవెంటనే మరొక ఎదురు దెబ్బ తగులుతుంది. తాజాగా నిన్నటికి నిన్న వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ రాజ్యసభ సభ్యత్వాలతో పాటు.. వైసిపి ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసేశారు. వీరులో ఒకరు మాజీ మంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్‌తో పాటు.. జైలులో ఉన్న వ్యక్తి ఆయిన మోపిదేవి వెంకటరమణ. వెంకటరమణ ఎన్నికల్లో ఓడిపోతే.. జగన్ ఎమ్మెల్సీని చేసి మరీ.. మంత్రిని చేసి క్యాబినెట్లో తన పక్కన కూర్చో పెట్టుకున్నారు. ycp{#}Beeda Masthan Rao;Mopidevi Venkata Ramana;YCPవైసిపికి ఈ రోజు దిమ్మతిరిగే షాక్‌.. ఆ ఇద్ద‌రు జంప్‌.. !వైసిపికి ఈ రోజు దిమ్మతిరిగే షాక్‌.. ఆ ఇద్ద‌రు జంప్‌.. !ycp{#}Beeda Masthan Rao;Mopidevi Venkata Ramana;YCPFri, 30 Aug 2024 15:26:57 GMTఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసిపికి వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక ఎదురుదెబ్బ నుంచి వైసీపీ వాళ్లు కాస్త కోలుకున్నారో లేదో.. వెంటనే మరొక ఎదురు దెబ్బ తగులుతుంది. తాజాగా నిన్నటికి నిన్న వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ రాజ్యసభ సభ్యత్వాలతో పాటు.. వైసిపి ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసేశారు. వీరులో ఒకరు మాజీ మంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్‌తో పాటు.. జైలులో ఉన్న వ్యక్తి ఆయిన మోపిదేవి వెంకటరమణ. వెంకటరమణ ఎన్నికల్లో ఓడిపోతే.. జగన్ ఎమ్మెల్సీని చేసి మరీ.. మంత్రిని చేసి క్యాబినెట్లో తన పక్కన కూర్చో పెట్టుకున్నారు.


ఆ తర్వాత మోపిదేవిని రాజ్యసభకు కూడా పంపారు. అలాంటి నేత ఇప్పుడు జగన్ దగ్గర ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. తాను టీడీపీలో చేరుతున్నట్టు ఓపెన్ గానే ప్రకటించేశారు. ఇక మరో రాజ్యసభ సభ్యుడు గతంలో టిడిపిలో ఉన్న బీద‌ మస్తాన్ రావు సైతం.. వైసీపీకి రాజీనామా చేసేశారు. ఆయన అడుగులు కూడా టిడి వైపే ప‌డ‌నున్నాయి. నిన్న వైసీపీకి తగిలిన ఈ ఎదురు దెబ్బల నుంచి ఆ పార్టీ నేతలు కోలుకోకముందే.. ఈరోజు మరో రెండు ఎదురుదెబ్బలు తగలబోతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయిగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నారు.


కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా తమ పదవులకు రాజీనామా చేసి మండలి చైర్మన్‌కు లేఖలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోతుల సునీత కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. వరుసపెట్టి ఎమ్మెల్సీలు.. ఒక్కొక్కరు పార్టీని విడుతూ ఉండడంతో.. మండలిలో వైసీపీ బలం రోజురోజుకు తగ్గిపోతోంది. అయితే వైసిపి నుంచి రాజీనామా చేసిన అందరు నేతలు, అందరూ ఎమ్మెల్సీలు టిడిపిలో చేర్చుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. కొందరిని పార్టీలో చేర్చుకునే విషయంలో టిడిపి నేతలు ఒప్పుకోవటం లేదని.. వీరంతా చంద్రబాబు దగ్గరే తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>