PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indian-politics-latest-news-bef6e59a-d38e-4849-84fe-479e95235c02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indian-politics-latest-news-bef6e59a-d38e-4849-84fe-479e95235c02-415x250-IndiaHerald.jpgఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)ని సరిగా 1925లో స్థాపించారు. అంటే సరిగ్గా 2025 నాటికి శతాబ్దకాలం పూర్తవుతుంది. వందేళ్లు ఒక సంస్థని నడపడం అంటే సాధారణం విషయం కాదు. ఈ రోజుకీ ఆరెస్సెస్ ఒక డిబేటింగ్ పాయింట్ గా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఉండడం ఇంకా విశేషం. అయితే ఆరెస్సెస్ కి ఉన్న రాజకీయ అంగమే బీజేపీ అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆరెస్సెస్ లక్ష్యం హిందూదేశం హిందూదేశంగా మారడం అని అంటారు. ఈ క్రమంలోనే హిందూత్వ భావన అంటే అది ఒక జీవన విధానం తప్ప మతం కాదని కూడా ఆరెస్సెస్ ప్రముఖులు వాదిస్తూ ఉంటారు.indian politics latest news {#}bhavana;Manam;Bharatiya Janata Party;Partyఆరెస్సెస్, బీజేపీ మధ్య సంబంధం అదేనా?ఆరెస్సెస్, బీజేపీ మధ్య సంబంధం అదేనా?indian politics latest news {#}bhavana;Manam;Bharatiya Janata Party;PartySat, 13 Jul 2024 12:00:00 GMTఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)ని సరిగా 1925లో స్థాపించారు. అంటే సరిగ్గా 2025 నాటికి శతాబ్దకాలం పూర్తవుతుంది. వందేళ్లు ఒక సంస్థని నడపడం అంటే సాధారణం విషయం కాదు. ఈ రోజుకీ ఆరెస్సెస్ ఒక డిబేటింగ్ పాయింట్ గా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఉండడం ఇంకా విశేషం. అయితే ఆరెస్సెస్ కి ఉన్న రాజకీయ అంగమే బీజేపీ అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆరెస్సెస్ లక్ష్యం హిందూదేశం హిందూదేశంగా మారడం అని అంటారు. ఈ క్రమంలోనే హిందూత్వ భావన అంటే అది ఒక జీవన విధానం తప్ప మతం కాదని కూడా ఆరెస్సెస్ ప్రముఖులు వాదిస్తూ ఉంటారు. మరో వైపు చూస్తే దేశానికి స్వాతంత్రం లభించడానికి 22 ఏళ్ల ముందు ఏర్పాటు అయిన ఆరెస్సెస్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళ నుంచి దేశంలో అత్యదిక వర్గంగా ఉన్న హిందువుల కోసం పనిచేస్తూ వస్తోందనేది నగ్న సత్యం. ఎందుకంటే ఈ భరతభూమి వేదభూమి కాబట్టి.

అయితే ఇపుడు ఇలాంటి అంశాలే రాజకీయం అవుతున్నాయి. వామ పక్షాలు వంటివి ఆరెస్సెస్ గురించి మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక విపక్షాలు సంగతి సరేసరి. అవి ఎలాగూ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి హిందుత్వంతో ముడిపెట్టి రాజకీయం చేస్తూ బడుగు బలహీన వర్గాల ఓట్లను కొల్లగొట్టాలని కలలు కంటూ ఉంటాయి. ఇక విజయవాడలో తాజాగా జరిగిన సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ 2025 నాటికి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నదే బీజేపీ అజెండా అని ఆరోపించారు. సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ ఎం ఏ బేబీ మాట్లాడుతూ హిందూ దేశం అన్న ఆలోచనలు ఆరెస్సెస్ లో ఉన్నాయని వాటిని సాకారం చేసే పనిలో బీజేపీ ఉందని ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం బీజేపీ - ఆరెస్సెస్ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకోవాలి. బీజేపీ ఏదన్నా సందర్భం వచ్చినపుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది తప్ప.. హిందూ మతం అన్న ఏర్పాటు మాటలు ఎప్పుడూ ఆడదు. అయితే బేసిగా ఈ భరత భూమి హిందూ ధర్మానికి సంబందించిన నేల కాబట్టి ఇతర మత పరమైన మార్పిడులను ఖండిస్తారు. ఇక ఆరెస్సెస్ కూడా అంతే... భారతీయ సనాతన సంప్రదాయాలను ప్రోత్సహిస్తాయే తప్పితే ఇతర మతాల వారిని మా మతంలో చేరండి అని ఏనాడూ చెప్పిన దాఖలాలు కనబడవు... ఇదే బీజేపీ - ఆరెస్సెస్ మధ్యన గల అవినాభావ సంబంధం. ఇది అర్ధం అయిన వారికి ధర్మం అర్ధం వుంటుంది. అర్ధం చేసుకోలేని కుంచిత స్వభావులకు అస్సలు ఏమీ అర్ధం కాదు!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>