Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kumari93c5b30a-bcc6-40b8-b132-9335b3ea9ceb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kumari93c5b30a-bcc6-40b8-b132-9335b3ea9ceb-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా కారణంగా హోటల్ నడిపే కుమారి ఆంటీ సెలబ్రిటీల రేంజ్‌లో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యింది. ఈమె అసలు పేరు దాసరి సాయి కుమారి. కానీ కుమారి ఆంటీగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు కుమారి ఆంటీ అంటే తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశక్తి కాదేమో. 13 ఏళ్లుగా హైదరాబాద్‌లో రోడ్ సైడ్ హోటల్ నడుపుతున్న ఈమె ఈ ఏడాది మొదట్లో చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఆమె వంట రుచి చూడాలని వందల మంది "కుమారి అండ్ స్ట్రీట్ ఫుడ్" స్టాల్‌కు ఇప్పటికీ పోటెత్తుతున్నారు. ట్రాఫిక్‌కు కూడా ఇKumari{#}Revanth Reddy;Nijam;Bigboss;television;House;Traffic police;police;Telangana;Telugu;News;mediaఏమో అనుకున్నాం కానీ.. కుమారి ఆంటీ సాధించేసిందిగా?ఏమో అనుకున్నాం కానీ.. కుమారి ఆంటీ సాధించేసిందిగా?Kumari{#}Revanth Reddy;Nijam;Bigboss;television;House;Traffic police;police;Telangana;Telugu;News;mediaSun, 16 Jun 2024 11:34:05 GMTసోషల్ మీడియా కారణంగా హోటల్ నడిపే కుమారి ఆంటీ సెలబ్రిటీల రేంజ్‌లో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యింది. ఈమె అసలు పేరు దాసరి సాయి కుమారి. కానీ కుమారి ఆంటీగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు కుమారి ఆంటీ అంటే తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశక్తి కాదేమో.

13 ఏళ్లుగా హైదరాబాద్‌లో రోడ్ సైడ్ హోటల్ నడుపుతున్న ఈమె ఈ ఏడాది మొదట్లో చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఆమె వంట రుచి చూడాలని వందల మంది "కుమారి అండ్ స్ట్రీట్ ఫుడ్" స్టాల్‌కు ఇప్పటికీ పోటెత్తుతున్నారు. ట్రాఫిక్‌కు కూడా ఇబ్బంది కలగడం వల్ల ఒకానొక సమయంలో పోలీసులు ఆమె బిజినెస్‌ను మూసి వేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. చివరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె హోటల్ మూసివేయొద్దని చెప్పడంతో పోలీసులు అడ్డుతొలిగారు.

దీని తర్వాత ఆమె మరింత పాపులర్ అయ్యింది. కొన్ని టీవీ ఛానళ్ల సీరియల్స్‌లో కూడా ఆమెను నటింపజేశారు. ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపించి ఆశ్చర్యపరిచింది. "రెండు లివర్లు ఎక్స్‌ట్రా మీది మొత్తం రూ.1,000 అయింది." అంటూ ఆమె చెప్పిన డైలాగు ఇప్పటికీ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆమె డైలాగ్‌ను వాడేశారు. కుమారి ఆంటీ బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారని వార్తలు వచ్చాయి. సాధారణంగా బిగ్ బాస్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్లని తీసుకొచ్చి హౌస్ లో పెడుతుంది. కుమారి ఆంటీ విషయంలో కూడా అలానే జరుగుతుందని అందరూ కామెంట్ చేస్తూ వచ్చారు, చివరికి వారి కామెంట్లయే నిజం కాబోతున్నాయని తెలుస్తోంది.

ఈసారి సీజన్‌లో కుమారి ఆంటీ ని ఒక కంటెస్టెంట్ గా తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్‌ నిర్ణయించిందట. ఈ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకొద్ది నెలల సమయం ఉంది. అయితే కుమారి ఆంటీని షోలో తీసేసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఆల్రెడీ ఆహ్వానం కూడా పంపారట. అయితే ఆమె తుది నిర్ణయం ఇంకా చెప్పలేదని తెలుస్తోంది ఒకవేళ ఆమె ఓకే చెప్తే ఈసారి హౌస్ లో సందడి చేసే అవకాశం ఉంది. చూడాలి మరి చివరికి ఆమె బిగ్బాస్ హౌస్‌లో అడుగు పెడుతుందో లేదో.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>