PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kutami4aeea092-4b5d-4558-80b6-2dedd304940b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kutami4aeea092-4b5d-4558-80b6-2dedd304940b-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం మొదటి సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసిపి పార్టీ 175 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో 151 అసెంబ్లీ స్థానాలను గెలిచి అద్భుతమైన మెజారిటీని సంపాదించుకొని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక 2024 వ సంవత్సరానికి గాను మే 13 వ తేదీన ఆంధ్రkutami{#}Telugu Desam Party;Parliment;Janasena;Assembly;TDP;Hanu Raghavapudi;Andhra Pradesh;YCP;Bharatiya Janata Partyవైసీపీ లాస్ట్ టైమ్ ఫిగర్ ని దాటేసిన కూటమి..!వైసీపీ లాస్ట్ టైమ్ ఫిగర్ ని దాటేసిన కూటమి..!kutami{#}Telugu Desam Party;Parliment;Janasena;Assembly;TDP;Hanu Raghavapudi;Andhra Pradesh;YCP;Bharatiya Janata PartyTue, 04 Jun 2024 10:59:40 GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం మొదటి సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి . ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భారీ మొత్తం లో అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసిపి పార్టీ 175 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో 151 అసెంబ్లీ స్థానాలను గెలిచి అద్భుతమైన మెజారిటీని సంపాదించుకొని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

ఇక 2024 వ సంవత్సరానికి గాను మే 13 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో 2019 కంటే ఎక్కువ ఓటింగ్ శాతం జరిగింది. దానితో అది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అని అన్ని పార్టీలు చెప్పుకుంటూ వచ్చాయి. ఇకపోతే ఈ రోజు ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. దాని ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది ఈవ్సారి ఓటింగ్ శాతం ఎక్కువ జరగడం అనేది కూటమికే కలిసి వచ్చింది.

ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చేంత కంటే కూడా ఎక్కువ స్థానాలలో లీడ్ లో ఉంది. ఇక ప్రస్తుతం కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే 153 అసెంబ్లీ స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక సొంతగా టిడిపి 128 స్థానాల్లో , జనసేన 19 స్థానాల్లో , బిజెపి 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వైసీపీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక పోయినసారి వైసీపీ 151 యొక్క అసెంబ్లీ స్థానాలను గెలుపొంది అధికారంలోకి వస్తే , ఈ సారి కూటమి అంతకంటే ఎక్కువ స్థానాలను సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>