PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apf0b5f1a0-ffa6-4c27-9b4b-9920ed7b357e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apf0b5f1a0-ffa6-4c27-9b4b-9920ed7b357e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు నుండే ప్రధాన పార్టీలు విపరీతమైన స్థాయిలో ప్రచారాలను మొదలుపెట్టారు. ఎలక్షన్లకు చాలా రోజుల ముందు నుండే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా ... టీడీపీ మాత్రం జనసేన తో కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగనున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తర్వాత టీడీపీ , జనసేన తో పాటు బీజేపీ కూడా ఈ కూటమిలో జాయిన్ అయింది. ఇకపోతే తాజాగా ఎలక్షన్ కమిషన్ Ap{#}Godavari River;Election Commission;pithapuram;Janasena;Parliment;kalyan;Bharatiya Janata Party;CBN;Elections;Assembly;Reddy;Andhra Pradesh;TDP;YCPఏపీ : ప్రధాన రాజకీయ నాయకుల ఓటింగ్లో టాప్ లో నిలిచిన పవన్..!ఏపీ : ప్రధాన రాజకీయ నాయకుల ఓటింగ్లో టాప్ లో నిలిచిన పవన్..!Ap{#}Godavari River;Election Commission;pithapuram;Janasena;Parliment;kalyan;Bharatiya Janata Party;CBN;Elections;Assembly;Reddy;Andhra Pradesh;TDP;YCPWed, 15 May 2024 13:56:01 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు నుండే ప్రధాన పార్టీలు విపరీతమైన స్థాయిలో ప్రచారాలను మొదలుపెట్టారు. ఎలక్షన్లకు చాలా రోజుల ముందు నుండే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా ... టీడీపీ మాత్రం జనసేన తో కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగనున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తర్వాత టీడీపీ , జనసేన తో పాటు బీజేపీ కూడా ఈ కూటమిలో జాయిన్ అయింది.

ఇకపోతే తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏ నియోజకవర్గంలో ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనే విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ తాజాగా ప్రకటించింది. దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ జరిగింది అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇక విరు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత గడ్డ అయినటువంటి పులివెందల నుండి పోటీలోకి దిగారు. ఈయన పోటీ చేసిన నియోజకవర్గం లో 81.06 ఓటింగ్ శాతం నమోదు అయింది. ఇక టీడీపీ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గం నుండి పోటీ చేశారు.

ఈయన పోటీ చేసిన నియోజకవర్గంలో 85.87% ఓటింగ్ నమోదు అయింది. ఇక జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజక వర్గం నుండి పోటీ చేశారు. ఈయన పోటీ చేసిన నియోజకవర్గం లో 86.87 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక ప్రధాన నేతలు అయినటువంటి ఈ ముగ్గురిలో కూడా పవన్ పోటీ చేసిన పిఠాపురం నియోజక వర్గం లో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అయింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>