PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan69606490-eb21-434f-a139-7308627eff7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan69606490-eb21-434f-a139-7308627eff7a-415x250-IndiaHerald.jpgకొద్ది గంటల్లో ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రేపు అనగా సోమవారం ఉదయాన్నే పోలింగ్ మొదలవ్వబోతోంది. ఈ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటని అందరికి తెలిసిన సంగతే. ఇక్కడ ఓట్లు కోసం పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడుతున్నాడు. ఎంతలా అంటే ఓట్లు కోసం సింపతీని కూడా బాగా వాడుకుంటున్నాడు. ఓట్లు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలలో కూడా చాలా ఘోరాతి ఘోరంగా Pawan Kalyan{#}sai dharam tej;Rajani kanth;Tammudu;Ishtam;Thammudu;monday;Chiranjeevi;politics;Elections;Cinema;Wife;Janasena;Bhimavaram;kalyan;pithapuram;YCPపవన్: ఓట్ల కోసం సింపతీ రీప్లే.. గెలుపుపై నమ్మకం లేదా?పవన్: ఓట్ల కోసం సింపతీ రీప్లే.. గెలుపుపై నమ్మకం లేదా?Pawan Kalyan{#}sai dharam tej;Rajani kanth;Tammudu;Ishtam;Thammudu;monday;Chiranjeevi;politics;Elections;Cinema;Wife;Janasena;Bhimavaram;kalyan;pithapuram;YCPSun, 12 May 2024 12:23:00 GMTకొద్ది గంటల్లో ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. రేపు అనగా సోమవారం ఉదయాన్నే పోలింగ్ మొదలవ్వబోతోంది. ఈ ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటని అందరికి తెలిసిన సంగతే. ఇక్కడ ఓట్లు కోసం పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడుతున్నాడు. ఎంతలా అంటే ఓట్లు కోసం సింపతీని కూడా బాగా వాడుకుంటున్నాడు. ఓట్లు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలలో కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది.అందుకే  ఈసారి గెలుపు కోసం ఫ్యాన్స్ కి ఇష్టం లేకపోయినా బీజేపీ, టీడీపీలతో కూటమిగా ఏర్పడి పిఠాపురాన్ని ఎంచుకుని అక్కడ నుంచి బరిలో నిల్చున్నాడు.పైగా గెలుపు కోసం సినిమా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నాడు.పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని పలువురు సినీ ప్రముఖులు పిఠాపురంలో బాగా ప్రచారం చేశారు.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించమని పిఠాపురం ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. చరణ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి నటులతో పాటు బుల్లి తెర ఆర్టిస్టులు కూడా పవన్ కోసం రంగంలోకి దిగారు.


అయితే పవన్ ఎప్పటిలాగే మళ్ళీ మళ్ళీ సింపతీ ప్లే చేస్తున్నారు.తన సొంతవారిని, ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెడుతున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.తన భార్యతో జరిగిన అనుభవాన్ని పంచుకోని కూడా ఎమోషనల్ అయ్యారు.నా భార్యని తిట్టారు.. ఆమె విదేశీయురాలు.. ఆమెకి ఇక్కడి రాజకీయాలు ఏవి తెలియవు.. ఎందుకు తిడుతున్నారు అని నన్ను అడిగింది.. భారతదేశంలో రాజకీయాలు అర్ధం కావు.. నన్ను క్షమించు అని తన భార్యను కోరినట్లు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఇదే సమయంలో నీకు ఎందుకు ఇంత పిచ్చి అని ఆయన భార్య అడిగితే.. ప్రజల కోసం నిలబడటానికే నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.నిజానికి ప్రజల కోసమే నిలబడాలంటే ఎలాంటి రాజకీయం అవసరం లేదు. రాజకీయాల్లోకి రాకుండా కూడా ప్రజాసేవ చెయ్యొచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనూ సూద్ లాంటి నటులు రాజకీయాల్లోకి రాకుండానే ప్రజా సేవలు చేస్తున్నారు.KA పాల్ గారు రాజకీయాల్లో రాకుండా ఎన్నో లక్షల కోట్లు దానం చేశారు. పవన్ కూడా సింపతీ ప్లే చేయకుండా KA పాల్, మహేష్, సోనూ సూద్ లాగే జనాలకు మంచి చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>