EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap9940294d-14bd-481a-a271-ef14c6306a72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap9940294d-14bd-481a-a271-ef14c6306a72-415x250-IndiaHerald.jpgఅన్నాదమ్ముల మధ్య సరిహద్దు, ఆస్తి వివాదాలు తలెత్తితే ఇద్దరూ కూర్చొని మాట్లాడితే దానికి పరిష్కారం లభిస్తుంది కానీ.. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లి పంచాయితీ పెడితే ఎప్పటకీ ఆ సమస్య తీరదు. చివరకు పళ్లు లేని పులి నోట్లో తలకాయ పెట్టినట్లు అవుతుంది. అది చంపదు. వదలదు అన్న చందంగా తయారవుతుంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ పరిస్థితి కూడా అంతే. 2014లో ఉమ్మడి ఏపీ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. కానీ విభజన హామీలు, తదితర వాటాల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీనిపై కూర్చొని మాట్లాడుకోవాల్సిన తెలుగు రాష్ట్రాap{#}Tiger;Andhra Pradesh;Telangana;Parliment;Prime Minister;Teluguఏపీ: విడిపోయి పదేళ్లు.. ఆ రాష్ట్రానికి ఇంత అన్యాయమా?ఏపీ: విడిపోయి పదేళ్లు.. ఆ రాష్ట్రానికి ఇంత అన్యాయమా?ap{#}Tiger;Andhra Pradesh;Telangana;Parliment;Prime Minister;TeluguTue, 07 May 2024 09:03:00 GMTఅన్నాదమ్ముల మధ్య సరిహద్దు, ఆస్తి వివాదాలు తలెత్తితే ఇద్దరూ కూర్చొని మాట్లాడితే దానికి పరిష్కారం లభిస్తుంది కానీ.. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లి పంచాయితీ పెడితే ఎప్పటకీ ఆ సమస్య తీరదు. చివరకు పళ్లు లేని పులి నోట్లో తలకాయ పెట్టినట్లు అవుతుంది. అది చంపదు. వదలదు అన్న చందంగా తయారవుతుంది. ఇప్పుడు  ఏపీ, తెలంగాణ పరిస్థితి కూడా అంతే.


2014లో ఉమ్మడి ఏపీ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. కానీ విభజన హామీలు, తదితర వాటాల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీనిపై కూర్చొని మాట్లాడుకోవాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు చివరకు మనపై పెత్తనాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అప్పటి నుంచి కేంద్రం చెప్పినట్లు వినాల్సి వస్తుంది. ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ని పార్లమెంట్ సాక్షిగా ఏపీ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఏమైనా అవకాశం ఉందా అన్న ప్రశ్నకు  ప్రధాని బదులిస్తూ..


అప్పట్లో ఇచ్చిన హామీల అమలు చేయడానికి మేం చిత్త శుద్ధితో పనిచేశాం. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే విభజన చట్టంలోని నిబంధనలను అమలు చేయాలని భావించాం.  ఏకాభిప్రాయ  సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించాలని 2014 నుంచి ఇప్పటి వరకు 33 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. కానీ ఏకాభిప్రాయం కొరవడక పోవడం వల్ల 89 సంస్థలు, కార్పొరేట్ల విభజన పూర్తి కాలేదు.


ఇందులో కొన్ని విషయాల్లో రెండు రాష్ట్రాలు కోర్టుల్లో కేసులు వేశాయి. దీంతో ఈ అంశాలు తీవ్ర జాప్యానికి కారణం అవుతున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారంతోనే ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుంది. సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ఒక సమన్వయకర్తగా మాత్రమే పనిచేస్తుంది. కానీ అక్కడి ప్రభుత్వాలు గత పదేళ్లుగా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి సమస్యలను పెండింగ్ లో పెట్టే పంథాను అనుసరించాయి. ఫలితంగా విభజన హామీల అమలు విషయంలో తెలుగురాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>