PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-202410ac06db-ff3e-4f18-9a03-1fd9f2b12a6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-202410ac06db-ff3e-4f18-9a03-1fd9f2b12a6f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి.రాయలసీమ అన్నమయ్య జిల్లా రాజంపేట బరిలో ఇద్దరు వారసుల మధ్య పోరు బాగా నడుస్తుంది.ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన నేత మధ్య పోరు జరుగుతుంది.ఇద్దరు నేతల మధ్య విమర్శల పర్వం రాజంపేట పాలిటిక్స్‌లో వేడి పెంచుతోంది. కూటమి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ నుంచి క్యాండేట్‌గా సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలోనే.. ఇద్దరు నేతలు ప్రచారం ప్రారంభించారు. కూటమి నుంచిAP Elections 2024{#}Punganur;Annamayya;mandalam;Chittoor;Rajampet;Andhra Pradesh;Telangana Chief Minister;CM;politics;YCP;MP;Bharatiya Janata Partyరాయ‌ల‌సీమ‌: రసవత్తరంగా మారుతోన్న రాజంపేట రాజకీయం?రాయ‌ల‌సీమ‌: రసవత్తరంగా మారుతోన్న రాజంపేట రాజకీయం?AP Elections 2024{#}Punganur;Annamayya;mandalam;Chittoor;Rajampet;Andhra Pradesh;Telangana Chief Minister;CM;politics;YCP;MP;Bharatiya Janata PartySun, 31 Mar 2024 13:53:35 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో  రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి.రాయలసీమ అన్నమయ్య జిల్లా రాజంపేట బరిలో ఇద్దరు వారసుల మధ్య పోరు బాగా నడుస్తుంది.ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన నేత మధ్య పోరు జరుగుతుంది.ఇద్దరు నేతల మధ్య విమర్శల పర్వం రాజంపేట పాలిటిక్స్‌లో వేడి పెంచుతోంది. కూటమి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ నుంచి క్యాండేట్‌గా సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలోనే.. ఇద్దరు నేతలు ప్రచారం ప్రారంభించారు. కూటమి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లిలో మొదటిసారి పర్యటించారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఈ సందర్భంగా.. వైసీపీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించడం జరిగింది. రాజంపేట, పుంగనూరుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీలేదన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. రాజకీయాన్ని డబ్బు సంపాదించడం కోసమే వాడుకున్నారని విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రజాధనాన్ని లూటీ చేశారని కోప్పడ్డారు.


ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని.. అప్పు చేయకుంటే ప్రస్తుతం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు కిరణ్‌కుమార్‌ రెడ్డి.ఇక, పుంగనూరు, రాజంపేట అభివృద్ధి చెందాయంటే అది పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌ వల్లనే అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరు వైసీపీ సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒకాయన సూట్‌కేస్‌తో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. జూన్‌ 4 వ తేదీ తర్వాత మళ్లీ అదే సూటుకేసుతో తిరిగి వెళ్లేలా జనాలు తీర్పు ఇస్తారన్నారు. ఇక మదనపల్లి, పుంగనూరు, పీలేరులో ముస్లిం ప్రజలు ఎక్కువ అని.. ఇటువంటి పరిస్థితుల్లో కూటమికి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.మొత్తంగా రాజంపేట రాజకీయం బాగా రసవత్తరంగా మారుతోంది. కూటమి అండతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. రెండుసార్లు వరుసగా గెలిచిన ధైర్యంతో మిథున్‌రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>