Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleda0fdb2e-c72f-4a3a-a0e5-4bbc0024714b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleda0fdb2e-c72f-4a3a-a0e5-4bbc0024714b-415x250-IndiaHerald.jpgచోటా భీమ్‌...దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్‌. వినోదాన్ని పంచే పాత్ర. ఎన్నో ఏళ్లుగా పిల్లల హృదయాల్ని దోచుకుంటునే ఉంది. కార్టూన్‌ పాత్రే అలా అలరిస్తే, వెండితెరపై భీమ్‌ చేసే లైవ్‌-యాక్షన్‌ ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధంగా ఉంది 'ఛోటా భీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దమ్యాన్‌' చిత్రబృందం.రాజీవ్‌ చిలకా దర్శకత్వంలో రానున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ గురు శంభు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. 'ఛోటsocialstars lifestyle{#}adhithya;mallela sitaramaraju;pujitha;rithika;producer;Cartoon;Producer;Darsakudu;Chaitanya;Yevaru;Chitram;Friday;Devarakonda;April;raja;Director;Cinemaవెండి తెరపై సందడి చేయనున్న ఛోటా భీమ్‌..!!వెండి తెరపై సందడి చేయనున్న ఛోటా భీమ్‌..!!socialstars lifestyle{#}adhithya;mallela sitaramaraju;pujitha;rithika;producer;Cartoon;Producer;Darsakudu;Chaitanya;Yevaru;Chitram;Friday;Devarakonda;April;raja;Director;CinemaSat, 16 Mar 2024 15:30:00 GMTచోటా భీమ్‌...దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్‌. వినోదాన్ని పంచే పాత్ర. ఎన్నో ఏళ్లుగా పిల్లల హృదయాల్ని దోచుకుంటునే ఉంది. కార్టూన్‌ పాత్రే అలా అలరిస్తే, వెండితెరపై భీమ్‌ చేసే లైవ్‌-యాక్షన్‌ ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధంగా ఉంది 'ఛోటా భీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దమ్యాన్‌' చిత్రబృందం.రాజీవ్‌ చిలకా దర్శకత్వంలో రానున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ గురు శంభు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. 'ఛోటా భీమ్‌ ఇప్పుడు పెద్ద తెరపై సందడి చేయనున్నాడు. తన స్నేహితులతో కలిసి ఢోలక్‌పూర్‌ని కాపాడేందుకు దమ్యాన్‌తో తలపడేందుకు భీమ్‌ సిద్ధంగా ఉన్నాడు' అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. 'సుందరమైన ఢోలక్‌పూర్‌ రాజ్యంపై కొందరి దుర్మార్గుల కళ్లు పడ్డాయి. ఆ రాజ్యంలో ఉండే శాంతిని విద్వంసంగా మార్చేందుకు చూస్తున్నాయి. ఇప్పుడా ఢోలక్‌పూర్‌ని ఎవరు కాపాడగలరు. అందుకు ఒకే ఒక ధైర్యవంతుడున్నాడు. అతడే భీమ్‌' అనే సంభాషణతో టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన స్నేహితులైన చుట్కీ, రాజు, ఇందుమతి...ఇలా పాత్రల పరిచయంతో, నేపథ్య గీతంతో అలరిస్తున్న ఈ సినిమా మే 24న విడుదల కానుంది.
ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా మిథున్‌ వరదరాజ కృష్ణన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'డ్యూయెట్‌'. దీన్ని కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. రితిక నాయక్‌ కథానాయిక. శుక్రవారం ఆనంద్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన పాత్ర లుక్‌ను విడుదల చేశారు. అందులో తను మనసంతా ప్రేయసినే నింపుకున్న ప్రేమికుడిలా ఆసక్తికరంగా కనిపించారు. ఇందులో తన పాత్ర పేరు మదన్‌. ''ఓ విభిన్నమైన ప్రేమకథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. త్వరలో ఫస్ట్‌లుక్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నాం'' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జి.వి.ప్రకాశ్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: అరుణ్‌ రాధాకృష్ణన్‌.వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో ఫస్ట్‌ కట్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'అర్జునుడి గీతోపదేశం'. అఖిల్‌రాజ్‌, దివిజ ప్రభాకర్‌, వాసంతిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. సతీశ్‌ గోగాడ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిలోక్‌నాథ్‌.కె, ప్రదీప్‌రెడ్డి.వి నిర్మాతలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.అమ్మిరాజు క్లాప్‌నివ్వగా, మల్లెల సీతారామరాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. త్రిలోక్‌నాథ్‌, పూజిత స్క్రిప్ట్‌ అందించారు. లక్కంశెట్టి వేణుగోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఇదే నా తొలి చిత్రం. వినూత్నమైన కథతో స్క్రిప్ట్‌ రాసుకున్నా. చెప్పగానే నటులు ఆసక్తిని కనబరిచారు. అమలాపురంలో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణని మొదలు పెడుతున్నాం. విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నైలో చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు. ''పేరు ఎంత ఆసక్తికరంగా ఉందో, ఈ కథ కూడా అలాగే ఉంటుంద''ని నిర్మాత తెలిపారు. రాజీవ్‌, ఆదిత్య శశికుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చైతన్య కందుల, కళ: కె.వి.రమణ, కూర్పు: అర్జున్‌, సంగీతం: చరణ్‌ అర్జున్‌.
సూర్యతేజ ఏలే కథానాయకుడిగా... కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భరతనాట్యం'. మీనాక్షి గోస్వామి కథానాయిక. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత. ఏప్రిల్‌ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ''దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. సినిమా కోసం తను రాసుకున్న కథలో ఏం జరిగిందో, తన జీవితంలోనూ అదే జరిగినప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు? చుట్టు ముట్టిన సమస్యల్ని ఎలా అధిగమించాడనే విషయాలు ఆసక్తికరం. వేసవి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం తప్పకుండా వినోదాన్ని పంచుతుంద''ని సినీ వర్గాలు తెలిపాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>