EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu422a32f9-d411-44e7-9478-596b6f4371c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu422a32f9-d411-44e7-9478-596b6f4371c4-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ అధికారానికి దూరం కావాలి. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈ లక్ష్యంతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ముందుకు సాగుతున్నారు. అతి కష్టం మీద బీజేపీని తమతో కలుపుకున్నారు. అయితే రెండు పార్టీల లక్ష్యం జగన్ ని గద్దె దించడం కాగా.. బీజేపీ మాత్రం తమ పార్టీ బలపడటం, ఏపీలో విస్తరించడం అనే విధానంతో కూటమితో జట్టు కట్టింది. బీజేపీ పెద్దల నిర్ణయంతో అటు టీడీపీ శ్రేణుల్లో, ఇటు చంద్రబాబు నాయుడిలో ఫుల్ జోష్ నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలకు కేటాయించిన 30 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలchandrababu{#}Jagan;Janasena;Josh;Pawan Kalyan;TDP;CBN;CM;Bharatiya Janata Party;Partyపొత్తుల పీకులాట.. చంద్రబాబుకు అసలు పరీక్ష?పొత్తుల పీకులాట.. చంద్రబాబుకు అసలు పరీక్ష?chandrababu{#}Jagan;Janasena;Josh;Pawan Kalyan;TDP;CBN;CM;Bharatiya Janata Party;PartyWed, 13 Mar 2024 23:00:00 GMTఏపీలో జగన్ అధికారానికి దూరం కావాలి. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈ లక్ష్యంతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ముందుకు సాగుతున్నారు. అతి కష్టం మీద బీజేపీని తమతో కలుపుకున్నారు. అయితే రెండు పార్టీల లక్ష్యం జగన్ ని గద్దె దించడం కాగా.. బీజేపీ మాత్రం తమ పార్టీ బలపడటం, ఏపీలో విస్తరించడం అనే విధానంతో కూటమితో జట్టు కట్టింది.


బీజేపీ పెద్దల నిర్ణయంతో అటు టీడీపీ శ్రేణుల్లో, ఇటు చంద్రబాబు నాయుడిలో ఫుల్ జోష్ నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలకు కేటాయించిన 30 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉంది.  అలాగే ఈ మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగేలా చూడాలి. అలా అయితేనే ఈ కూటమికి విజయం చేకూరే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే పరాభవం తప్పదు.


సాధారణంగా పార్టీ నాయకులు కలిసిపోయినంత సులభంగా కార్యకర్తలు కింది స్థాయిలో పనిచేయరు. అధినేత ఏం చెప్పినా.. గుడ్డిగా చేసేద్దాం అనే పరిస్థితి పార్టీ కార్యకర్తల్లో ఉండదు. ఇప్పటికే జనసేన, టీడీపీ ల మధ్య కొంత దూరం ఉంది. వీరిని సమన్వయం చేసేలా పార్టీ అధినేతలు వ్యూహాలు రచిస్తున్న తరుణంలో ఇప్పుడు బీజేపీ వచ్చి చేరింది.


గతంలో చంద్రబాబుపై కోపంతోనే బీజేపీ సానుభూతి పరులంతా వైసీపీకి మద్దతు తెలిపారు. ఈసారి వీరంతా తిరిగి మళ్లీ టీడీపీకి ఓటే వేస్తారా అంటే సందేహమే. జనసైనికులు అయితే సీఎం సీఎం వంటి నినాదాలతో పవన్ కల్యాణ్ సభలకు హాజరయ్యేవారు. టీడీపీతో జనసేనాని పొత్తు పెట్టుకున్నా సీఎం షేరింగ్ ఉంటుందని వారంతా ఆశించారు. వీరితో పాటు కాపులు కూడా రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ల కోరిక పవన్ ద్వారా నెరవేరుతుందని భావించారు. కానీ ఇది లేదని తేలిపోయింది. దీంతో ఇటు జనసైనికులు, అటు కాపులు ఈ కూటమి వైపు మళ్లుతారా అనేది ఎన్నికల తర్వాతే తేలనుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>