Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health408d52a1-3f71-4fdf-9569-7a1dce3c4d5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health408d52a1-3f71-4fdf-9569-7a1dce3c4d5e-415x250-IndiaHerald.jpgనేటి జనరేషన్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మందులు అనేవి ఒక భాగంగా మారిపోయాయి అని చెప్పాలి. మందులు అనగానే ఏదో మందు అనుకోకండి. ఆరోగ్యం బాగా లేకపోతే వేసుకునే మందు గురించే మనం మాట్లాడుకుంటుంది. ఇటీవల కాలంలో ఉరుకుల పరుగులు జీవన శైలిలో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది. వెరసి ఇక ఆరోగ్యం మీద పెద్దగా దృష్టి పెట్టక.. చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇక తరచూ హాస్పిటల్ కు వెళ్లడం ఇక డాక్టర్లు చెప్పినమందులు వాడటం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ తర్వాత మాత్రం Health{#}Postmortem;Vitamin;Heart;Calcium;Coronavirus;Manamతస్మాత్ జాగ్రత్త.. డాక్టర్ పర్మిషన్ లేకుండా.. ఇలాంటివి అస్సలు చేయొద్దు?తస్మాత్ జాగ్రత్త.. డాక్టర్ పర్మిషన్ లేకుండా.. ఇలాంటివి అస్సలు చేయొద్దు?Health{#}Postmortem;Vitamin;Heart;Calcium;Coronavirus;ManamSat, 09 Mar 2024 11:50:00 GMTనేటి జనరేషన్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మందులు అనేవి ఒక భాగంగా మారిపోయాయి అని చెప్పాలి. మందులు అనగానే ఏదో మందు అనుకోకండి. ఆరోగ్యం బాగా లేకపోతే వేసుకునే మందు గురించే మనం మాట్లాడుకుంటుంది. ఇటీవల కాలంలో ఉరుకుల పరుగులు జీవన శైలిలో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది. వెరసి ఇక ఆరోగ్యం మీద పెద్దగా దృష్టి పెట్టక.. చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇక తరచూ హాస్పిటల్ కు వెళ్లడం ఇక డాక్టర్లు చెప్పినమందులు వాడటం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ధ కాస్త పెరిగిపోయింది అని చెప్పాలి.


 ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఏం లాభం ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు అనే విషయం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అప్పటి నుంచి అధిక పోషకాలు ఉన్న పదార్థాలు ఔషధాలు తీసుకుంటున్నారు. ఇందులో ఒకటి విటమిన్ డి. ఇది శరీరానికి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. అయితే ఇది శరీరానికి ఎంత మేలు చేస్తుందో అధిక మోతాదులో తీసుకుంటే అంతే ప్రమాదకరంగా కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి విటమిన్ డి అధిక మోతాదులో తీసుకున్నాడు. చివరికి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. యూకే లోని సర్రేలో నివాసం ఉంటున్న డేవిడ్ మిచ్ నర్ అనే 89 ఏళ్ల వ్యక్తి విటమిన్ డి కారణంగా చివరికి ప్రాణాలు కోల్పోయాడు.


 అతనికి పోస్టుమార్టం నిర్వహించి రక్త నమూనాలను పరిశీలించగా విటమిన్ డి మోతాదులు తీసుకోవడం కారణంగానే ప్రాణాలు పోయాయి అని వైద్యులు నిర్ధారించారు. ఏకంగా అతని వైద్య పరీక్షల్లో విటమిన్ డి మోతాదు 380 వరకు ఉన్నట్లు తేలింది. అధిక మోతాదులో విటమిన్ డి తీసుకోవడం వల్ల గుండె కిడ్నీ ఫెయిల్ అయ్యాయని వైద్యులు గుర్తించారు. అయితే ఇక ఈ విటమిన్ డి ని ఎంత మొత్తం తీసుకోవాలి అనే విషయం సప్లిమెంట్ ప్యాకెట్ పై ఎలాంటి హెచ్చరికలు లేకపోవడం కారణంగానే అతను ఇలాంటివి చేశాడు అన్న విషయాన్ని కూడా గుర్తించారు అధికారులు. అయితే విటమిన్ డి తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం పెరుగుతుంది. విటమిన్ డి ఎక్కువైతే అది విషపూరితంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో వయసు పైబడిన వారందరూ కూడా విటమిన్ డి తీసుకోవడం రోజువారి అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయంపై మాత్రం జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>