PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prithvi-raj9d3878f6-3830-4d34-a4b6-eea0a5852b98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prithvi-raj9d3878f6-3830-4d34-a4b6-eea0a5852b98-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమాల్లో పృథ్వీరాజ్ అంటే చాలా తక్కువ మందికి తెలిసినా కానీ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అంటే మాత్రం చాలా మంది వెంటనే గుర్తుపడతారు.ఈ మధ్య కాలంలో తనదైన కామెడీతో అలరిస్తున్న ఆయన... మరోవైపు రాజకీయాలపైన కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో గతంలో వైసీపీ తరుపున ప్రచారం చేస్తూ.. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కూడా పొందారు.ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన ఆ పదవికి.. తదనుగుణంగా వైసీపీకి కూడా దూరం అయ్యాడు. ఆ తరువాత పాలిటిక్స్ పై పెద్దగా స్పందించినట్లు కనిపించని పృథ్వPrithvi Raj{#}Janasena;contract;Sri Venkateswara Bhakti Channel;Coronavirus;YCP;Andhra Pradesh;Government;Party;Telangana Chief Minister;CM;Industry;kalyanసీఎంఓపై పృథ్వీరాజ్ సెన్సేషనల్ కామెంట్స్?సీఎంఓపై పృథ్వీరాజ్ సెన్సేషనల్ కామెంట్స్?Prithvi Raj{#}Janasena;contract;Sri Venkateswara Bhakti Channel;Coronavirus;YCP;Andhra Pradesh;Government;Party;Telangana Chief Minister;CM;Industry;kalyanTue, 13 Feb 2024 14:44:24 GMTటాలీవుడ్ సినిమాల్లో పృథ్వీరాజ్ అంటే చాలా తక్కువ మందికి తెలిసినా కానీ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అంటే మాత్రం చాలా మంది వెంటనే గుర్తుపడతారు.ఈ మధ్య కాలంలో తనదైన కామెడీతో అలరిస్తున్న ఆయన... మరోవైపు రాజకీయాలపైన కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో గతంలో వైసీపీ తరుపున ప్రచారం చేస్తూ.. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కూడా పొందారు.ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన ఆ పదవికి.. తదనుగుణంగా వైసీపీకి కూడా దూరం అయ్యాడు. ఆ తరువాత పాలిటిక్స్ పై పెద్దగా స్పందించినట్లు కనిపించని పృథ్వీరాజ్.. ఆ తరువాత జనసేన పార్టీ తరుపున తన వాయిస్ వినిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఆధికారికంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న ఆయన... ఒక ఇంటర్వ్యూలో కరోనా నాటి సంగతులను గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా CMO పై సంచలన ఆరోపణలు కూడా చేశారు.ఇక ప్రస్తుతం జనసేన నేతగా ఉన్న  పృథ్వీరాజ్ ముఖ్యమంత్రి కార్యాలయంపై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా... సెకండ్‌ వేవ్‌ లో కరోనా బారినపడి.. ఆస్పత్రిలో బెడ్‌ కావాలని సీఎం క్యాంపు ఆఫీస్‌ కు ఫోన్‌ చేసినా కూడా ఎవరూ స్పందించలేదని అన్నారు.


ఆ సమయంలో నాగబాబు, సాయికుమార్‌ స్పందించి, తన వైపు నిలబడ్డారని ఆయన అన్నారు. ఆ సమయంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీనే తనను ఆదుకుందని పృద్వి తెలిపారు.ఇదే సమయంలో... పలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఇంకా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పృథ్వీరాజ్. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్‌ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం షర్మిలనే అని చెప్పిన ఆయన... జనసేన-టీడీపీ కలిసి మ్యానిఫెస్టో రూపొందిస్తున్నాయని.. వాటిని ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు.ఇంకా ఇదే సమయంలో... ఓటు విలువను నాటక రూపంలో ప్రతీ ఊళ్లోనూ ప్రదర్శిస్తామని కూడా తెలిపారు.అలాగే ఎస్వీబీసీ ఛైర్మన్‌ గా కాంట్రాక్ట్‌ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసినట్లు చెప్పిన పృథ్వీరాజ్... ఆ సమయంలో బ్రహ్మోత్సవాలు చేయడం ఆయనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఆ సమయంలో ఉత్సవాల్లో ఎక్కడ చూసినా తానే కనిపిస్తుండటంతో కొంతమంది దాన్ని తీసుకోలేకపోయారని.. దాని ఫలితంగా వివాదాలను సృష్టించారని అన్నారు. ఇక ఇప్పుడు బోర్డు సభ్యులు కావాలంటే డబ్బులు ఉంటే చాలని.. అక్కడ నియంతృత్వ పాలన నడుస్తోందని ఆయన తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>