PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-manipost4f88613d-ce02-4e47-bb92-e5684f101633-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-manipost4f88613d-ce02-4e47-bb92-e5684f101633-415x250-IndiaHerald.jpgసార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఎక్కువగా కసరత్తులు చేస్తున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం అంటూ బహిరంగ సభలతో రణభేరిని మోగించారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో భీమిలి ప్రాంతంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార శంకరాన్ని పూరించారు. ఈనెల మూడవ తేదీన మలివిడత సభను ఏలూరు జిల్లాలోని దెందులూరులో నిర్వహించారు. 5 విడుదలలో 75 అసెంబ్లీ లోక్సభ స్థానాల అభ్యర్థులను సైతం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మAP;CM.MANIPOST{#}Eluru;Bheemili;Annamayya;Puttaparthi;March;Vishakapatnam;Elections;Andhra Pradesh;District;Event;Congress;Party;Assembly;Jagan;CMఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. నవరత్నాలకు మించి ఏపీ సీఎం జగన్ కొత్త ప్రకటన..!!ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. నవరత్నాలకు మించి ఏపీ సీఎం జగన్ కొత్త ప్రకటన..!!AP;CM.MANIPOST{#}Eluru;Bheemili;Annamayya;Puttaparthi;March;Vishakapatnam;Elections;Andhra Pradesh;District;Event;Congress;Party;Assembly;Jagan;CMSat, 10 Feb 2024 08:00:00 GMTసార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఎక్కువగా కసరత్తులు చేస్తున్నాయి. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం అంటూ బహిరంగ సభలతో రణభేరిని మోగించారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో భీమిలి ప్రాంతంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార శంకరాన్ని పూరించారు. ఈనెల మూడవ తేదీన మలివిడత సభను ఏలూరు జిల్లాలోని దెందులూరులో నిర్వహించారు. 5 విడుదలలో 75 అసెంబ్లీ లోక్సభ స్థానాల అభ్యర్థులను సైతం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రకటించింది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో ఏపీ సీఎం జగన్ జోరు పెంచారు. ముఖ్యంగా ఈ నెలలోనే పలు రకాల కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఈనెల 13వ తేదీన విశాఖపట్నం నుంచి స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్ర ఫైల్ ని కూడా అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తూ అక్కడే వైయస్సార్ చేయూత నిధులను కూడా విడుదల చేస్తున్నారు. 18వ తేదీన సిద్ధం బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు. అనంతరం ఆ తర్వాత అనంతపూర్ జిల్లా రాప్తాడులో జరిగే ఈ సభలో ఈసారి సరికొత్త మేనిఫెస్టోతో పాటు 2019లో కీలకంగా మారిన నవరత్నాలకు మించి హామీలు ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా మహిళలకు, రైతులకు కీలకమైన అంశాలను చర్చించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం 21వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలలో రైతుల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయబోతున్నారు 24వ తేదీన కర్నూలులో ఈబీసీ నేస్థం మూడో విడతను కూడా రిలీజ్ చేయబోతున్నారు. 27న గుంటూరులో విద్యా దీవెన నాలుగవ సారి నిధులను విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం. మార్చి 5న పుట్టపర్తి జిల్లాలో జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను రీలీజ్ చేయబోతున్నారు. అదే నెల ఆరవ తేదీన మంత్రివర్గ సమావేశాలతో మాట్లాడి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>