LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shonti-uses0b80bedc-238e-47f7-a85c-f07334b4eb62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/shonti-uses0b80bedc-238e-47f7-a85c-f07334b4eb62-415x250-IndiaHerald.jpgవర్షాకాలం మొదలైంది అంటే చాలు రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు మన ఇంటి చుట్టూనే తిరుగుతుంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇంట్లో ఒకరికి జ్వరం కానీ,దగ్గు గాని మొదలైందంటే చాలు ఇంటిల్లిపాదికి రావడం మాత్రం తథ్యం.అలా వైరల్ ఇన్ఫెక్షన్లు మన జోలికి రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.అందులో ముఖ్యంగా శోంఠిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కలగజేస్తుందట.మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.. తీవ్రమైన జ్వరం దగ్గుతో బాధపడేవారు ఒSHONTI;USES{#}Heart;Shakti;Evening;Pepper Powder;Manamవైరల్ ఇన్ఫెక్షన్లకు శోంఠి ఎలా చెక్ పెడుతుందో తెలుసా..?వైరల్ ఇన్ఫెక్షన్లకు శోంఠి ఎలా చెక్ పెడుతుందో తెలుసా..?SHONTI;USES{#}Heart;Shakti;Evening;Pepper Powder;ManamWed, 18 Oct 2023 19:00:00 GMTవర్షాకాలం మొదలైంది అంటే చాలు రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు మన ఇంటి చుట్టూనే తిరుగుతుంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇంట్లో ఒకరికి జ్వరం కానీ,దగ్గు గాని మొదలైందంటే చాలు ఇంటిల్లిపాదికి రావడం మాత్రం తథ్యం.అలా వైరల్ ఇన్ఫెక్షన్లు మన జోలికి రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.అందులో ముఖ్యంగా శోంఠిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కలగజేస్తుందట.మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి..

తీవ్రమైన జ్వరం దగ్గుతో బాధపడేవారు ఒక గ్లాసు పాలలో చిటికెడు సొంటి వేసి ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల వాటికి తొందరగా ఉపశమనం కలుగుతుంది.ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అంతేకాక అధిక జలుబు తీవ్రమైన కఫంతో బాధపడే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనిని పిల్లలు తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు.కానీ అలాంటి వారికి తేనెతో కలిపి రోజుకు ఒక ముద్ద తినిపించడం వల్ల కూడా వారికి రోగనిరోధక శక్తి పెరిగి,జ్వరం దగ్గు జలుబు తొందరగా తగ్గిపోతాయి.

తీవ్రమైన ఉబ్బసం,అస్తమా,ముక్కు దిబ్బడ,తలబారం వంటి సమస్యలతో బాధపడేవారికి శోంఠి,మీరియాలు, తేనే కలిపి తీసుకోవడంతో వాటికీ చిటికెలో ఉపశమనం దొరుకుతుంది.

అంతేకాక సొంటిని తరచూ తీసుకోవడం వల్ల,సీజనల్ వ్యాధులే కాక దీర్ఘకాళిక రోగాలైన గుండె జబ్బులు,కిడ్నీ సమస్యలు,ఊపిరితిత్తుల సమస్యలను కూడా దరిచేరకుండా కాపాడుతుంది.మరియు చెడు రక్తాన్ని శుభ్రం చేయడంలో కూడా సహాయపడి, బ్లడ్ క్లాట్ అవడం రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఎవరైనా తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతూ ఉంటే, ఇలాంటివారు చిటికెడు సొంటి తీసుకొని,చిటికెడు లవంగాల పొడి,చిటికెడు మిరియాల పొడి కలిపి,నీళ్లు వేసి చిన్న ముద్ద లాగా తయారు చేసుకుని,పంటికింద పెట్టుకోవడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. కావున మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే తొందరగా శోంఠిని ఉపయోగించడం మొదలుపెట్టండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>