HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health79fee018-344d-43b0-89f2-af8f00d0ac3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health79fee018-344d-43b0-89f2-af8f00d0ac3d-415x250-IndiaHerald.jpgమినుములతో చేసే సున్ని సంగటి వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని ఎక్కువగా ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు తయారు చేసి పెడుతూ ఉంటారు.దీనిని తినడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి ఇంకా నీరసం తగ్గుతుంది.అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అందుకే ఖచ్చితంగా ఆడపిల్లలు, స్త్రీలు దీనిని తప్పకుండా తయారు చేసుకుని తినాలి. ఈ సున్ని సంగటిని తయారుచేయడం కూడా చాలా సులభం.ఎవరైనా కూడా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసే Health{#}salt;Jaggery;Gas Stove;Mixie;oil;Manamఆడవాళ్లని బలంగా ఉంచే ఆహారం ఇదే?ఆడవాళ్లని బలంగా ఉంచే ఆహారం ఇదే?Health{#}salt;Jaggery;Gas Stove;Mixie;oil;ManamTue, 03 Oct 2023 16:11:00 GMTమినుములతో చేసే సున్ని సంగటి వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని ఎక్కువగా ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు తయారు చేసి పెడుతూ ఉంటారు.దీనిని తినడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి ఇంకా నీరసం తగ్గుతుంది.అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అందుకే ఖచ్చితంగా ఆడపిల్లలు, స్త్రీలు దీనిని తప్పకుండా తయారు చేసుకుని తినాలి. ఈ సున్ని సంగటిని తయారుచేయడం కూడా చాలా సులభం.ఎవరైనా కూడా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసే ఈ సున్ని సంగటిని ఎలా తయారు చేసుకోవాలి.. పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక సున్ని సంగటి తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు మినపప్పును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ గాలికి దానిని ఆరబెట్టాలి.ఆ తరువాత బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. తరువాత ఒక కళాయిలో మినుములు వేసి చిన్న మంటపై వేయించాలి. ఆ మినుములు చక్కగా వేగి మంచి వాసన వచ్చిన తరువాత గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తరువాత అదే కళాయిలో బియ్యాన్ని కూడా వేసి వేయించాలి.ఆ బియ్యం చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇక ఇందులోనే మినపప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో బెల్లం ఇంకా నీళ్లు పోసి వేడి చేయాలి.


ఆ బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి మరలా కళాయిలోకి తీసుకోవాలి.ఇక ఆ బెల్లం నీళ్లు మరిగిన తరువాత ఉప్పు వేసి కలపాలి. ఆ తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని ఒక్క చేత్తో వేస్తూ మరో చేత్తో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.ఆ తరువాత నువ్వుల నూనెను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా నూనెని వేసిన తరువాత ఈ మిశ్రమం బాగా ఉడికి నూనె పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలగానే యాలకుల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సున్ని సంగటి ఈజీగా తయారవుతుంది. ఇది చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి. దీనిని తినడం వల్ల రుచితో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్కంద: వసూళ్లు పర్లేదు కానీ.. ఇంకా సరిపోవు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>