DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/bjpcdb0f13b-3828-40dd-817f-8228369466f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/bjpcdb0f13b-3828-40dd-817f-8228369466f3-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ పేరు అడ్డం పెట్టుకుని బీజేపీ ఆంధ్రలో ఓట్లు సాధిస్తుందని కేంద్రంలోని నాయకత్వం ఆశిస్తుంది. ఎందుకంటే 1998 లో ఎన్టీఆర్ తో కలిసి బీజేపీ పయనించినపుడు అది 18 శాతం ఓట్లతో మంచి ప్రతిభ కనబరిచింది. బీజేపీకి ఏపీలో 18 శాతం ఓట్లు అంటే ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఓటింగ్ శాతం పూర్తిగా పడిపోయి దిగజారిపోయింది. దీన్ని రికవరీ చేయడాానికి ఎన్టీఆర్ కుతూరునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. అయితే పురందేశ్వరీ నియామకంతో ఆంధ్రలో బీజేపీ పుంజుకుంటుందా అంటే చాలా వరకు కష్టమనే విBJP{#}Jayanthi;Andhra Pradesh;MP;NTR;Elections;Bharatiya Janata Party;TDP;CBN;Successఏపీలో బీజేపీని ఎన్టీఆర్‌ గట్టెక్కిస్తాడా?ఏపీలో బీజేపీని ఎన్టీఆర్‌ గట్టెక్కిస్తాడా?BJP{#}Jayanthi;Andhra Pradesh;MP;NTR;Elections;Bharatiya Janata Party;TDP;CBN;SuccessTue, 15 Aug 2023 13:00:00 GMTఎన్టీఆర్ పేరు అడ్డం పెట్టుకుని బీజేపీ ఆంధ్రలో ఓట్లు సాధిస్తుందని కేంద్రంలోని నాయకత్వం ఆశిస్తుంది. ఎందుకంటే 1998 లో ఎన్టీఆర్ తో కలిసి బీజేపీ పయనించినపుడు అది 18 శాతం ఓట్లతో మంచి ప్రతిభ కనబరిచింది. బీజేపీకి ఏపీలో 18 శాతం ఓట్లు అంటే ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఓటింగ్ శాతం పూర్తిగా పడిపోయి దిగజారిపోయింది.


దీన్ని రికవరీ చేయడాానికి ఎన్టీఆర్ కుతూరునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. అయితే పురందేశ్వరీ నియామకంతో ఆంధ్రలో బీజేపీ పుంజుకుంటుందా అంటే చాలా వరకు కష్టమనే వినిపిస్తోంది. బీజేపీ వేసిన ఎత్తు 1998 సంవత్సరం నాటిదని.. ఇప్పుడు టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ పేరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 1999 లో టీడీపీతో జత కట్టిన బీజేపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంది.  


7 ఎంపీ స్థానాలు, 14 మంది ఎమ్మెల్యేలు 18 శాతం ఓట్లతో ఉన్న టీడీపీ 1999 ఎన్నికలు వచ్చే సరికి  టీడీపీతో పొత్తు పెట్టుకుని 3 శాతం ఓట్లకు పరిమతమైంది. దీనికి కారణం ఎన్టీఆర్ అనే పేరును విడిచిపెట్టి టీడీపీ చెంత చేరడం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రలో బీజేపీ పుంజుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టింది. అది చంద్రబాబును కాదని పురందేశ్వరీని ముందుండి నడిపించాలని భావిస్తోంది.


ఇందులో భాగంగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో రూ.100 ఎన్టీఆర్ నాణేన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సమావేశాలకు కుటుంబ సభ్యులు హాజరుకావాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ భార్యగా లక్ష్మి పార్వతిని పిలుస్తారా.. లేక పురందేశ్వరీ మాత్రమే కార్యక్రమంలో పాల్గొని తన ఆధిపత్యాన్ని చాటుకుంటారా చూడాలి. మరి చంద్రబాబు ఫ్యామిలీని ఈ ప్రోగ్రాంకు ఆహ్వానిస్తారా లేదా.. మొత్తం మీద బీజేపీ వేసిన ఫ్లాన్ సక్సెస్ అయితే ఆంధ్రలో తిరిగి తన సత్తా చాటుకోవడం ఖాయం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లయ్యాక కూడా.. ఆ హీరోపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్న కాజల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>