EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/babu15b696bb-97f5-4a52-ba02-599b7ee7b1c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/babu15b696bb-97f5-4a52-ba02-599b7ee7b1c4-415x250-IndiaHerald.jpgవచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. మళ్లీ గెలిస్తే ఆయనే సీఎం అవుతారు. అయితే.. చంద్రబాబు ఇక జ‌న్మలో ముఖ్యమంత్రి కాలేర‌ని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అంటున్నారు. ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు సిగ్గురాలేదని.. బాబు హయాంలో ప్రాజెక్టుల పేరుతో 40 వేల కోట్ల రూపాయలు స్కాం చేశారని.. బాబు కాంట్రాక్టర్లందరూ వేల కోట్ల అధిపతులుగా ఎదిగిపోయారని... ఆయన అధికారంలోకి వస్తే చాలు బడా బాబులందరికీ పండుగేనని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. babu{#}CBN;festival;CM;Telangana Chief Minister;MLA;YCP;Raptadu;Peruru;Reddyఇక చంద్రబాబు జన్మలో సీఎం కాలేరా?ఇక చంద్రబాబు జన్మలో సీఎం కాలేరా?babu{#}CBN;festival;CM;Telangana Chief Minister;MLA;YCP;Raptadu;Peruru;ReddySat, 05 Aug 2023 09:43:00 GMTవచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. మళ్లీ గెలిస్తే ఆయనే సీఎం అవుతారు. అయితే.. చంద్రబాబు ఇక జ‌న్మలో ముఖ్యమంత్రి కాలేర‌ని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అంటున్నారు. ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు సిగ్గురాలేదని.. బాబు హయాంలో ప్రాజెక్టుల పేరుతో 40 వేల కోట్ల రూపాయలు స్కాం చేశారని.. బాబు కాంట్రాక్టర్లందరూ వేల కోట్ల అధిపతులుగా ఎదిగిపోయారని... ఆయన అధికారంలోకి వస్తే చాలు బడా బాబులందరికీ పండుగేనని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  అన్నారు.


జగనన్న ఉంటే పేదలకు పండగ అని... కార్మికులు, కర్షకులు, బడుగు, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు పండుగ అన్న వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి .. జీడిపల్లి, మాల్యాల రిజర్వాయర్లు నేనే కట్టానని చంద్రబాబు బోగస్‌ మాటలు చెబుతున్నాడన్నారు. 2014లో ఆయన అధికారంలోకి వచ్చేనాటికి నాలుగుసార్లు జీడిపల్లి రిజర్వాయర్‌ను నీటితో నింపారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  గుర్తు చేశారు. రాజశేఖర్‌రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తెస్తే చంద్రబాబు సిగ్గులేకుండా తప్పుడు కూతలు కూస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  మండిపడ్డారు.


కర్నాటక నుంచి నీళ్లు తీసుకొని వస్తానంటున్న చంద్రబాబూ.. నువ్వేమైనా పుడింగివా అని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  ప్రశ్నించారు. పేరూరు డ్యాంకు పైసా ఖర్చు లేకుండా నీళ్లు తీసుకురావచ్చని వందసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని.. నీహయాంలో ఏమైనా చెవ్వులో సీసం పోసుకుని ఉన్నావా అని చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  ప్రశ్నించారు.


చంద్రబాబు  హయాంలో నీళ్లు ఇచ్చింటే ఆయనకే మంచిపేరు వచ్చేదని.. బాధ్యత కల్గిన ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రరతిపాదనలు చేస్తే పట్టించుకోకుండా బాబు చేయాల్సిన దోపిడీని చేసేశారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  విమర్శించారు. హంద్రీ –నివా పేజ్‌ –2 పనుల్లో మిగిలిపోయిన 10 కోట్ల పనులను 100 కోట్లకు పెంచేసుకుని చంద్రబాబు దోపిడీ చేశారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  విమర్శించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>