EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modida65a860-1802-479b-aa1b-76c33d4a1a6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modida65a860-1802-479b-aa1b-76c33d4a1a6f-415x250-IndiaHerald.jpgఈమధ్య బ్యాంకుల నుండి లోను తీసుకోవడం, వాటిని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేయడం కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చేస్తున్న పని. వాళ్లు బ్యాంకులు నుండి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని ఆ తర్వాత దివాలా తీసేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా బ్యాంకుల దగ్గర నుండి లోన్లు తీసుకొని కొంతమంది రాజకీయాల్లోకి వెళ్లిపోవడం జరుగుతుంటే, మరి కొంత మంది ఆ డబ్బులు వ్యాపారాల్లో పెట్టుకొని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరూ బ్యాంకులకు తిరిగి చెల్లించిన పాపాన పోలేదు. దానితో వీరి వల్ల బ్యాంకింగ్ రంగం అMODI{#}Banking;Narendra;Prime Minister;Joseph Vijay;Manamమోదీ గ్రేట్.. రూ.10 లక్షల కోట్లు తెచ్చాడా?మోదీ గ్రేట్.. రూ.10 లక్షల కోట్లు తెచ్చాడా?MODI{#}Banking;Narendra;Prime Minister;Joseph Vijay;ManamTue, 01 Aug 2023 06:00:00 GMTఈమధ్య బ్యాంకుల నుండి లోను తీసుకోవడం, వాటిని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేయడం కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చేస్తున్న పని. వాళ్లు బ్యాంకులు నుండి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని ఆ తర్వాత దివాలా తీసేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా బ్యాంకుల దగ్గర నుండి లోన్లు తీసుకొని కొంతమంది రాజకీయాల్లోకి వెళ్లిపోవడం జరుగుతుంటే, మరి కొంత మంది  ఆ డబ్బులు వ్యాపారాల్లో పెట్టుకొని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.


కానీ వాళ్ళు ఎవరూ బ్యాంకులకు తిరిగి చెల్లించిన పాపాన పోలేదు. దానితో వీరి వల్ల బ్యాంకింగ్ రంగం అనేది కుదేలైన పరిస్థితి ఏర్పడింది. అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు చేశాడు. అంతే కాక బ్యాంకులను విలీనం చేసే పద్ధతి ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అంతే కాకుండా ఇలా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్న  డబ్బు తిరిగి కట్టని వాళ్ళ దగ్గర నుండి కూడా ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని ఆయన అధికారంలోకి రాకముందు ప్రజలకు వాగ్దానం చేశారు.


ఆయన ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో దాన్ని కార్యాచరణలో పెట్టారు. భారతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గత 9 ఆర్థిక సంవత్సరాల్లో, దాదాపు 10 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులను రికవరీ చేశాయి. దేశ ఆర్థిక శాఖా కార్యదర్శి మాట్లాడుతూ, ఆర్థిక ఆస్తుల సెక్యూరిటీ పునర్నిర్మాణం అలాగే భద్రత, వడ్డీ చట్టం 2022అమలు దివాలా కోరు సంస్కృతిని మార్చడానికి సహాయపడిందని అన్నారు.


అలా తాను ఇచ్చిన మాట ప్రకారం 2016లో ఒక చట్టం, 2022లో ఒక చట్టం తీసుకువచ్చారు మోడీ. వీటి ప్రకారం  సొమ్ము ఎగ్గొట్టి విదేశాల్లో దాక్కున్న విజయ్ మాల్యా లాంటి వాళ్ల దగ్గర నుంచి కూడా సొమ్మును రాబట్టవచ్చు. ఆ విధంగా వాళ్ల దేశాలలో చట్టాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నారు నరేంద్ర మోడీ. మరి ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉందో..?



RRR Telugu Movie Review Rating

"జవాన్" మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులకు ఏకంగా అంతా కోడ్ చేస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>