EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu1ada2a46-423d-433d-82a3-36300a975ff8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu1ada2a46-423d-433d-82a3-36300a975ff8-415x250-IndiaHerald.jpg2009 సంవత్సరంలో టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశారు. కానీ ఆ పోటీ అనంతరం ఆంధ్రలో టీడీపీ బాగానే సీట్లు సాధించినా టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో చాలా వరకు దెబ్బతింది. పోటీ చేసిన స్థానాలు 50 వరకు ఉంటే కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని ఢీలా పడింది. దీంతో ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే కేసీఆర్ ను అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటలను దారుణంగా విమర్శించారు. అనంతరం కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి బయటకు రాని పరిస్థితి. ఇలా ఎన్నో రోజులు ఓటమి గురించి కుంగిపోయారు.CHANDRABABU{#}KCR;dr rajasekhar;Telangana Rashtra Samithi TRS;Jagan;TDP;Pawan Kalyan;News;Andhra Pradesh;Yatra;Janasena;Amit Shah;Bharatiya Janata Party;media;MLA;CBN;Partyపవన్‌ ఎఫెక్ట్‌: బాబుకి మళ్లీ టెన్షన్ మొదలైందా?పవన్‌ ఎఫెక్ట్‌: బాబుకి మళ్లీ టెన్షన్ మొదలైందా?CHANDRABABU{#}KCR;dr rajasekhar;Telangana Rashtra Samithi TRS;Jagan;TDP;Pawan Kalyan;News;Andhra Pradesh;Yatra;Janasena;Amit Shah;Bharatiya Janata Party;media;MLA;CBN;PartyTue, 20 Jun 2023 06:00:00 GMT2009 సంవత్సరంలో టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశారు. కానీ ఆ పోటీ అనంతరం ఆంధ్రలో టీడీపీ బాగానే సీట్లు సాధించినా టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో చాలా వరకు దెబ్బతింది. పోటీ చేసిన స్థానాలు 50 వరకు ఉంటే కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని ఢీలా పడింది. దీంతో ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే కేసీఆర్ ను అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటలను దారుణంగా విమర్శించారు. అనంతరం కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి బయటకు రాని పరిస్థితి. ఇలా ఎన్నో రోజులు ఓటమి గురించి కుంగిపోయారు.


పొత్తు పెట్టుకుని ఏమైనా తప్పులు చేశామా అని ఆలోచనలో పడ్డారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం కొన్ని మీడియా సంస్థలు తెలంగాణకు అనుకూలంగా వార్తలు రాయడం, కేసీఆర్ నిరసన దీక్ష ఒక్కో అంశం కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. మొన్నటి వరకు జనసేన, టీడీపీ పొత్తు కుదిరిందనే వార్తలు వినిపించాయి. ఇక రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం మాత్రమే ఉందని చెప్పుకున్నారు. అమిత్ షాతో చంద్రబాబు మీటింగ్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అంతా బాగుంది జగన్ ను ఇక ఓడించడమే తరువాయి అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు.


వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత ప్రచారం లో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. జనసేనకు అవకాశం ఇవ్వాలని మీ గురించి పోరాడే పార్టీ జనసేన మాత్రమేనని ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే తానేంటో నిరూపిస్తానని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇన్ని రోజులు పొత్తు పెట్టుకుని ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకున్న చంద్రబాబు పవన్ స్పీచ్ తర్వాత ఆయనలో మళ్లీ టెన్షన్ మొదలైందని అనుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

"బ్రో" మూవీ టీజర్ వచ్చేది అప్పుడే..?

కేసీఆర్‌ అతి గొప్ప కార్యక్రమం.. ఇవాళ మరోసారి?

అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?

అమెరికా.. ఉక్రెయిన్‌ను నిండా ముంచేస్తోందా?

డీకేఎస్‌ చేతిలో తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు బాధ్యత?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>