PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ttd7dcc600b-c443-4c80-be0b-500ec65c0285-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ttd7dcc600b-c443-4c80-be0b-500ec65c0285-415x250-IndiaHerald.jpgతిరుమల శ్రీవారి దర్శనం కోసం ఇంకా పరిమిత సంఖ్యలోనే టికెట్లు విడుదల చేస్తోంది టీటీడీ. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కూడా రద్దీలేకుండా చూడాలనేది టీటీడీ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఇప్పటినుంచి ఏర్పాట్లు చేస్తోంది. అయితే సంక్రాంతి తర్వాతనుంచి పరిమిత కోటా ఎత్తేస్తామని, టికెట్ల సంఖ్య పెంచుతామని తాజాగా టీటీడీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ttd{#}Tirupati;Tirumala Tirupathi Devasthanam;Makar Sakranti;Telugu;Newsశ్రీవారి భక్తులకు ఆ అదృష్టం లేదు..?శ్రీవారి భక్తులకు ఆ అదృష్టం లేదు..?ttd{#}Tirupati;Tirumala Tirupathi Devasthanam;Makar Sakranti;Telugu;NewsSun, 12 Dec 2021 07:05:54 GMTతిరుమల శ్రీవారి దర్శనం కోసం ఇంకా పరిమిత సంఖ్యలోనే టికెట్లు విడుదల చేస్తోంది టీటీడీ. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కూడా రద్దీలేకుండా చూడాలనేది టీటీడీ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఇప్పటినుంచి ఏర్పాట్లు చేస్తోంది. అయితే సంక్రాంతి తర్వాతనుంచి పరిమిత కోటా ఎత్తేస్తామని, టికెట్ల సంఖ్య పెంచుతామని తాజాగా టీటీడీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

వణికిస్తున్న ఒమిక్రాన్..
అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ దశలో కేంద్రం కూడా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. రాత్రి కర్ఫ్యూ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడకపోయినా ప్రభుత్వాలు మాత్రం జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశాయి. జరిమానాలతో హడలెత్తిస్తున్నాయి. రక్షణ చర్యలు చేపట్టాయి. ఈ దశలో తిరుమల దర్శనాల సంఖ్య పెంచడం అసాధ్యం అని చెప్పొచ్చు.

ఇటీవల కాలంలో తిరుమల దర్శనం సామాన్య భక్తులకు బాగా కష్టమైపోయింది. టికెట్లు అన్నీ ఆన్ లైన్లోనే విడుదల చేస్తుంటారు. విడుదలైన కొన్ని గంటల్లోనే అవి పూర్తవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టికెట్ల సంఖ్య పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే అదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం కూడా కలవరపెడుతోంది. వివిధ రకాల విశ్లేషణలు, నిపుణుల అంచనాల ప్రకారం జనవరిలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో కేసులు గరిష్టంగా రావొచ్చని అంటున్నారు. ఈ దశలో వ్యాక్సినేషన్ స్పీడ్ చేయాలి, పరీక్షల సంఖ్య పెంచాలని కూడా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

సంక్రాంతి తర్వాత దర్శనాల సంఖ్య పెంచేందుకు టీటీడీ బోర్డ్ ఏర్పాట్లు చేసినా అది సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్ ప్రభావం పెరిగినా, థర్డ్ వేవ్ మొదలైనా.. కొత్త ఆంక్షలు మొదలవుతాయి. అంటే ఇప్పటికంటే అప్పుడు దర్శనాల సంఖ్య మరింత తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే సంక్రాంతి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేం. టీటీడీ నిర్ణయం తీసుకున్నా.. స్వామివారిని దర్శించుకునే అవకాశం సామాన్య భక్తులకు మరికొన్నిరోజులు కష్టసాధ్యమేనని చెప్పాలి.



హ్యాపీ సండే 12-DEC: ఈ వారం జ‌బ‌ర్ద‌స్త్‌లో బిగ్ కాంట్ర‌వ‌ర్సీలివే...!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>