PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr3b435519-e1e8-42d6-945d-63539c61a4d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr3b435519-e1e8-42d6-945d-63539c61a4d8-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా లో భాగమేనని సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ తీర్థయాత్ర లతో అయ్యేది లేదు పొయ్యేదీ లేదు... కల్లంలో ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలేమిటి ? అని నిలదీశారు రేవంత్ రెడ్డి. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి చెప్పాలి.. కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి పోయిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వ్యవసాయ చట్టాలపై telangana {#}KCR;revanth;Congress;CM;Telangana Rashtra Samithi TRS;District;Delhi;Telangana;Telangana Chief Minister;Governmentటిఆర్ఎస్, బిజేపి పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ ?టిఆర్ఎస్, బిజేపి పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ ?telangana {#}KCR;revanth;Congress;CM;Telangana Rashtra Samithi TRS;District;Delhi;Telangana;Telangana Chief Minister;GovernmentThu, 25 Nov 2021 07:33:49 GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా లో భాగమేనని సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.  ఈ తీర్థయాత్ర లతో అయ్యేది లేదు పొయ్యేదీ లేదు... కల్లంలో ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలేమిటి ? అని నిలదీశారు  రేవంత్ రెడ్డి. తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి చెప్పాలి.. కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి పోయిందని మండిపడ్డారు  రేవంత్ రెడ్డి. వ్యవసాయ చట్టాలపై రైతుల ఒత్తిడితోనే కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు  రేవంత్ రెడ్డి. యాసంగి ధాన్యం కొనమని ఒత్తిడిచేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిటి ఉరితాడైంది.. కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతుల ఆవేదననే నేను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు  రేవంత్ రెడ్డి. 

బీజేపీ, టీఆర్ఎస్ లు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయి.. కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు  రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలని.. రైతులకు హామీ ఇచ్చిన లక్ష రుణమాఫీ చేయాలన్నారు  రేవంత్ రెడ్డి. ఎరువులు ఉచితంగా ఇస్తామన్న హామీని అమలు చేయాలని..  చని పోయిన రైతు కుటుంబాలు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి... తక్షణం వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు  రేవంత్ రెడ్డి.  కౌలు రైతుల సమస్యల పరిష్కారం చేయాలని కోరారు  రేవంత్ రెడ్డి. రైతాంగ సమస్యలపై నేడు, రేపు మండల, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు  రేవంత్ రెడ్డి. భవిష్యత్ లో కూడా రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఉదృతం చేస్తుందని స్పష్టం చేశారు  రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజం కూడా రైతులకు అండగా నిలవాల్సిన సందర్బమని వెల్లడించారు  రేవంత్ రెడ్డి.



మళ్లీ వాన గండం... క్షణక్షణం భయం భయం..!

ప్రేక్షక టాలీవుడ్: అభిమానులు ఏడ్చినా పట్టదా...?

32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు: మంత్రి పెద్దిరెడ్డి

జగన్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీ విలవిల..!

రాయ‌ల చెరువు వ‌ద్ద చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

జగన్ నిర్ణయంపై బిజెపి ఓవర్ యాక్షన్ చేస్తుందా...?

ఓసారి మీరే ఆలోచించుకోండి.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు?

ఇక‌పై ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల విక్ర‌యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>