PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpgరాజధాని అమరావతి కోసం రైతుల ఆందోళనలు 700వ రోజుకు చేరుకున్న సందర్భంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో కీలకమైనది మూడు రాజధానుల ప్రకటన. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా కావాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే మూడు రాజధానులు ఉండాలని కీలక ప్రకటన కూడా చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖ నగరాన్ని, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కరCourt{#}Prashant Kumar;Kurnool;Vishakapatnam;Amaravati;Lawyer;Y. S. Rajasekhara Reddy;YCP;Capital;Telangana Chief Minister;Jagan;CM;Government;Party;High court;shyamరాజధాని రైతుల పోరాటంపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు....!రాజధాని రైతుల పోరాటంపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు....!Court{#}Prashant Kumar;Kurnool;Vishakapatnam;Amaravati;Lawyer;Y. S. Rajasekhara Reddy;YCP;Capital;Telangana Chief Minister;Jagan;CM;Government;Party;High court;shyamTue, 16 Nov 2021 17:10:14 GMTరాజధాని అమరావతి కోసం రైతుల ఆందోళనలు 700వ రోజుకు చేరుకున్న సందర్భంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో కీలకమైనది మూడు రాజధానుల ప్రకటన. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా కావాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే మూడు రాజధానులు ఉండాలని కీలక ప్రకటన కూడా చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖ నగరాన్ని, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాన్ని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. ఆ ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 700 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. హైకోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని త్రి సభ్య ధర్మాసనం రోజు వారీ విచారణ ప్రారంభించింది.

విచారణలో భాగంగా రెండో రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. రాజధాని అనేది కేవలం రైతుల కోసం మాత్రమే కాదన్నారు. రాజధాని నగరం అంటే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి చెందిన నగరం అని సీజే వ్యాఖ్యానించారు. రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. రైతులు ఎంతో విలువైన భూములను రాజధాని కోసం ఇచ్చేశారని... దీని వల్ల వారి జీవనోపాధిని కూడా కోల్పోయారని శ్యామ్ దివాన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రైతులకు కౌలు సహా ఇతర హామీలు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయటం లేదని... వెంటనే వాటిని నెరవేర్చాలని శ్యామ్ దివాన్ హైకోర్టును కోరారు. కేవలం రాజకీయ విద్వేషంతోనే రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఘోష్ట్ క్యాపిటల్‌గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందన్నారు శ్యామ్ దివాన్. 30 వేల మంది రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారంటే.. అది చిన్న విషయం కాదన్నారు హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. దేశం కోసం స్వాతంత్ర్య సమర యోధులు చేసిన పోరాటం వారి వ్యక్తిగతం కాదని... అలాగే రైతుల దీక్షలు కూడా వారి వ్యక్తిగతం కాదన్నారు సీజే. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులపై త్వరలోనే తీర్పు ఇస్తామన్నారు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.





ఏపీలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసే టైం వచ్చిందా...?

బెస్ట్‌ టూరిజం విలేజ్ గా "భూదాన్ పోచంప‌ల్లి"

రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల‌పై ఏపీ హై కోర్టు ఏమ‌న్న‌దంటే..?

'విరాట పర్వం' రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

ఎక్స్ ప్రెస్ హైవేపై ల్యాండైన ప్రధాని మోదీ ??

జగన్ వద్దకు మాజీ కలెక్టర్...? వైసీపీ తీర్థం...!

చాలా బాధేసింది.. ఓపెన్ అయిన వార్నర్?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట విషాదం..!

సీఎం కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారాడు !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>