PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/policee80392ff-3c50-432e-92cd-b1f127bbacca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/policee80392ff-3c50-432e-92cd-b1f127bbacca-415x250-IndiaHerald.jpgదక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 14వతేదీన కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోమ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీకీ కేంద్ర హోమ్ శాఖ అధికారులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్‌లు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బౌమ్మయ్, కేరళ ముఖ్యమంత్రి పినరయPolice{#}nandu;vedhika;Kerala;Pinarayi Vijayan;Taj Mahal;Renigunta;Amith Shah;Tamilnadu;Telangana Chief Minister;Cheque;Traffic police;Tirupati;District;Minister;Telangana;sree;Andhra Pradesh;central government;police;Jaganనిఘా నీడలో తిరుపతి... పోలీసులు హై అలర్ట్...!నిఘా నీడలో తిరుపతి... పోలీసులు హై అలర్ట్...!Police{#}nandu;vedhika;Kerala;Pinarayi Vijayan;Taj Mahal;Renigunta;Amith Shah;Tamilnadu;Telangana Chief Minister;Cheque;Traffic police;Tirupati;District;Minister;Telangana;sree;Andhra Pradesh;central government;police;JaganFri, 12 Nov 2021 14:21:54 GMTదక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 14వతేదీన కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోమ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీకీ కేంద్ర హోమ్ శాఖ అధికారులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్‌లు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బౌమ్మయ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరు కానున్నారు. ఈ సమావేశం కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న తిరుపతిలో అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా హాజరవుతున్నారు.

ఈ నేపధ్యంలో తిరుపతి నగరం మొత్తం పోలీసుల కంట్రోల్‌లోకి చేరింది. ఇప్పటికే సమావేశంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. భద్రత ఏర్పాట్లపై సమాక్షా సమావేశాన్ని జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు జిల్లా ప్రధాన కార్యాలయం నందు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈనెల 14న తిరుపతిలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా హాజరవుతున్న నేపధ్యంలో భద్రత ఏర్పాట్లపై సమాక్షా సమావేశాన్ని జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు జిల్లా ప్రధాన కార్యాలయం నందు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై డి.యస్.పి స్థాయి అధికారులను సమన్వయ నోడల్ ఆఫీసర్‌గా నియమించి భద్రత పరమైన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి అత్యంత ప్రముఖులు రానున్నందున వారికి భద్రతా పరమైన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నోడల్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి సమావేశ వేదిక అయిన తాజ్ హోటల్‌తో పాటు తిరుమల వరకు ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్, యాంటీ సబటేజ్ చెక్ లను అలర్ట్ చేశారు. ప్రముఖులందరూ తిరుమల శ్రీవారి దర్శనార్థం సూచనలు ఉన్న కారణంగా వారు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. వేదిక చుట్టుపక్కల పరిసరాల్లో ప్రత్యేక సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీలు చేపట్టాలన్నారు.





జగన్ కేంద్రానికి లొంగిపోయారు: హరీష్ రావు సంచలన కామెంట్స్

నాకు చాలా నమ్మకం ఉంది: మోడీ

బిగ్ బాస్ 5: దూసుకొస్తున్న షణ్ముఖ్... టైటిల్ వేటలో ముందంజ ?

వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ విడుద‌ల .. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?

బుల్లి పిట్ట: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ తో రన్ అయ్యే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

దేశంలోనే ఫ‌స్ట్ టీఆర్ఎస్‌.. సెకండ్ టీడీపీ...!

టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు మృతి

షన్నుని అన్‌ ఫాలో కొట్టిన దీప్తి కారణం ఆమెనా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>