PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7290f923-e603-4c86-ac40-dbe7e09129cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7290f923-e603-4c86-ac40-dbe7e09129cd-415x250-IndiaHerald.jpg పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి స‌వరించిన అంచ‌నా వ్యయాన్ని ఆమోదించాల‌ని ఎప్ప‌టి నుంచో రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేర‌కు నిన్న‌టి వేళ పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)తో రాష్ట్ర యంత్రాంగం భేటీ అయింది. 53 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా స‌వ‌రించిన అంచ‌నాలు పెట్టుబ‌డి వ్య‌యం కింద చూపించింది. ఈ వివ‌రాలు త‌మ వ‌ద్ద‌కే రాలేద‌ని పీపీఏ వెల్ల‌డించింద‌ని, ఏపీ అధికారుల‌పై ఫైర్ అయింద‌ని ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకు భిన్నంగా సాక్షి క‌థ‌నాలు వ‌చ్చాయి. మొత్తమ్మీద పోల‌వ‌రం ప్రాజెక్టుకుycp{#}Polavaram Project;Sakshi;Andhra Pradesh;central government;media;TDPపోలవ‌రం లెక్క‌ల‌పై మోడీ ఫైర్ ?పోలవ‌రం లెక్క‌ల‌పై మోడీ ఫైర్ ?ycp{#}Polavaram Project;Sakshi;Andhra Pradesh;central government;media;TDPThu, 11 Nov 2021 13:20:49 GMTరాష్ట్రం విడిపోయాక కేంద్రం తన వంతుగా చేసిన ఏకైక సాయం పోల‌వ‌రంను జాతీయ ప్రాజెక్టుగా చూపించడం. అందుకు త‌గ్గ విధంగా నిధులు కేటాయించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్రంతో  సంప్ర‌తింపులు చేప‌ట్ట‌డం. అయితే నిధుల కేటాయింపుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బందులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు ప‌నుల‌లో వేగం కూడా పెద్ద‌గా లేద‌న్న ఆరోప‌ణ టీడీపీ నుంచి వ‌స్తోంది.  ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సవ‌రించిన అంచ‌నాలు అనుస‌రించి కేటాయిస్తే ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంద‌ని ఎప్ప‌టి నుంచో రాష్ట్రం మొత్త‌కుంటోంది. కానీ కేంద్రం కంటి తుడుపు చ‌ర్య‌గానే నిధులు విడుద‌ల చేసి ప‌క్క‌కు త‌ప్పుకుంటోంది.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి స‌వరించిన అంచ‌నా వ్యయాన్ని ఆమోదించాల‌ని ఎప్ప‌టి నుంచో రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేర‌కు నిన్న‌టి వేళ పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)తో రాష్ట్ర యంత్రాంగం భేటీ అయింది. 53 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా స‌వ‌రించిన అంచ‌నాలు పెట్టుబ‌డి వ్య‌యం కింద చూపించింది. ఈ వివ‌రాలు త‌మ వ‌ద్ద‌కే రాలేద‌ని పీపీఏ వెల్ల‌డించింద‌ని, ఏపీ అధికారుల‌పై ఫైర్ అయింద‌ని ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకు భిన్నంగా సాక్షి క‌థ‌నాలు వ‌చ్చాయి. మొత్తమ్మీద పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విష‌య‌మై ఎప్ప‌టి నుంచో కేంద్రం కొర్రీలు పెడుతున్న మాట వాస్త‌వ‌మే అయినా వీటిపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండిపోతోంది.

ఇప్ప‌టికే ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించి రీ యింబ‌ర్స్ చేయాల్సిన 2100 కోట్ల రూపాయ‌లు వెంట‌నే చెల్లించాల‌ని రాష్ట్ర అధికారులు కోరుతున్నారు. ఇదే సంద‌ర్భంలో పీపీఏ ఆఫీసును రాజ‌మండ్రిలో ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర యంత్రాంగం కోరింద‌ని కూడా జ‌గ‌న్ మీడియా చెబుతోంది. ఇవ‌న్నీ బాగున్నా కేంద్రం నిధుల చెల్లింపుల్లో కానీ సవ‌రించిన పెట్టుబ‌డి నిధుల‌పై కానీ ఏ మాత్రం స్పందించేలా లేదు. కానీ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మ‌ల‌చి త‌నెంతో సాయం రాష్ట్రానికి చేశాన‌ని చెబుతోంది. నిన్న‌టి వేళ హైద్రాబాద్ కేంద్రంగా జ‌రిగిన ఈ స‌మావేశం ప‌లు అంశాల‌కు కేంద్ర బిందువు అయిన‌ప్ప‌టికీ నిధుల విష‌య‌మై కేంద్రాన్ని అడిగేందుకు రాష్ట్ర యంత్రాంగం కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేసినప్ప‌టికీ వాటిపై ఎటువంటి స్ప‌ష్ట‌తా లేదు. నిర్వాసితుల‌కు సంబంధించి భూసేక‌ర‌ణ నిమిత్తం చెల్లించాల్సిన మొత్త‌మే 30 వేల కోట్ల రూపాయ‌లు అని, దీనిని ప్ర‌తిపాదించిన మేర‌కు చెల్లించేందుకు  కేంద్రం ముందుకు రావాల‌ని కోరారు. ఇవ‌న్నీ కేంద్రం ఒప్పుకుంటుందో లేదో అన్న‌ది ఇప్పుడిక ఆస‌క్తిదాయకం.



జ‌ల‌దిగ్బంధంలో చెన్నై.. జోరుగా వాన

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>