PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/boild-rice-war-between-central-and-telanganac0940414-8ede-458d-b232-6929bfb3e8f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/boild-rice-war-between-central-and-telanganac0940414-8ede-458d-b232-6929bfb3e8f3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. నిన్నటి వరకు ఒక సమస్య... ఇప్పుడు మరో సమస్య. నిన్న మొన్నటి వరకు నీరు లేక ఇబ్బంది పడిన అన్నదాతలు ఇప్పుడు ఏ పంట వేయాలో కూడా అర్థం కాక తలలు పట్టుకున్నారు. నిన్నటి వరకు ప్రకృతి విపత్తులతో నష్టాల పాలైన రైతన్నలకు ఇప్పుడ వరి బెంగ పట్టుకుంది. అసలు ఏ పంట సాగు చేయాలో కూడా అర్థం కానీ పరిస్థితి. ప్రభుత్వమేమో వరి సాగు చేయవద్దని ఆదేశిస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం ఎందుకు సాగు చేయకూడదని ప్రశ్నిస్తున్నారు. రైతులు వరే సాగు చేస్తారని... ఎలా ఆపుతారో చPaddy{#}prakruti;Aqua;Uri;Telangana Chief Minister;Telangana Rashtra Samithi TRS;Reddy;Government;Minister;KCR;Telanganaవరిపై రైతుల్లో ఆందోళన... గజిబిజి గందరగోళం..!వరిపై రైతుల్లో ఆందోళన... గజిబిజి గందరగోళం..!Paddy{#}prakruti;Aqua;Uri;Telangana Chief Minister;Telangana Rashtra Samithi TRS;Reddy;Government;Minister;KCR;TelanganaWed, 10 Nov 2021 11:12:34 GMTప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. నిన్నటి వరకు ఒక సమస్య... ఇప్పుడు మరో సమస్య. నిన్న మొన్నటి వరకు నీరు లేక ఇబ్బంది పడిన అన్నదాతలు ఇప్పుడు ఏ పంట వేయాలో కూడా అర్థం కాక తలలు పట్టుకున్నారు. నిన్నటి వరకు ప్రకృతి విపత్తులతో నష్టాల పాలైన రైతన్నలకు ఇప్పుడ వరి బెంగ పట్టుకుంది. అసలు ఏ పంట సాగు చేయాలో కూడా అర్థం కానీ పరిస్థితి. ప్రభుత్వమేమో వరి సాగు చేయవద్దని ఆదేశిస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం ఎందుకు సాగు చేయకూడదని ప్రశ్నిస్తున్నారు. రైతులు వరే సాగు చేస్తారని... ఎలా ఆపుతారో చూస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అసలు వరి సాగు చేయాలా... వద్దా అని రైతులు డైలామాలో ఉన్నారు కూడా. వరి పంట సాకు చెయ్యొద్దని ఏకంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచిస్తున్నారు.

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని... ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గతేడాది వరకు వరి మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వమే ప్రొత్సహించింది. కానీ ఈ ఏడాది మాత్రం వరి సాగు చేయవద్దని... అలా చేస్తే... ధాన్యం కొనుగోలు బాధ్యత మాకు సంబంధం లేదని తేల్చి చెప్పేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే ఇప్పుడు రైతులకు అర్థం కాని పరిస్థితి. యాసంగి పంటకు సంబంధించి వడ్లు కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో సరైన నీటి సౌకర్యం లేక రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరు తడి పంటల సాగులో పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువతో అప్పుల పాలయ్యారు. కానీ ఇప్పుడు పుష్కలమైన నీటి వసతి కారణంగా వరి పంట సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. యాసంగి వరి సాగు వడ్లు కొనుగోలు చేయకుండా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో తెలంగాణ రైతులు ఆగమాగం అవుతున్నారు.





కేంద్రం పై పోరాటానికి సిద్దమైన టీఆర్ఎస్ ?

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>