PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doijahsf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doijahsf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సరైన సబ్జెక్ట్ మాట్లాడే నాయకులు చాలా తక్కువైపోయారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అరుపులు, బూతులు, తీవ్ర విమర్శలు తప్ప పూర్తి సబ్జెక్ట్ ద్వారా ప్రత్యర్ధులకు చెక్ పెట్టే నాయకులు అటు అధికార వైసీపీలో గానీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలో గానీ పెద్దగా కనిపించడం లేదు. ఎంతసేపు టీడీపీ నేతలు ఏమో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసేస్తారు....ప్రతి అంశంపైన ఆలోచించుకోకుండా మాట్లాడేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలు విమర్శలు చేసే అంశంపై కౌంటర్లు ఇవ్వకుండా, బూతులతో, ఎదురుదాడితో ముందుకెళుతtdp{#}YCP;Cheque;PAYYAVULA KESHAV;electricity;TDP;Andhra Pradesh;Governmentపయ్యావులతోనే పెద్ద చిక్కులాగా ఉంది?పయ్యావులతోనే పెద్ద చిక్కులాగా ఉంది?tdp{#}YCP;Cheque;PAYYAVULA KESHAV;electricity;TDP;Andhra Pradesh;GovernmentTue, 09 Nov 2021 02:30:00 GMTప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సరైన సబ్జెక్ట్ మాట్లాడే నాయకులు చాలా తక్కువైపోయారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అరుపులు, బూతులు, తీవ్ర విమర్శలు తప్ప పూర్తి సబ్జెక్ట్ ద్వారా ప్రత్యర్ధులకు చెక్ పెట్టే నాయకులు అటు అధికార వైసీపీలో గానీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలో గానీ పెద్దగా కనిపించడం లేదు. ఎంతసేపు టీడీపీ నేతలు ఏమో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసేస్తారు....ప్రతి అంశంపైన ఆలోచించుకోకుండా మాట్లాడేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలు విమర్శలు చేసే అంశంపై కౌంటర్లు ఇవ్వకుండా, బూతులతో, ఎదురుదాడితో ముందుకెళుతున్నారు.

ఇక వైసీపీ నేతలకు తగ్గట్టుగానే టీడీపీ నేతలు కూడా బూతులతో రెచ్చిపోతున్నారు. వైసీపీలో, టీడీపీలో బూతులు మాట్లాడే నాయకులు ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఇలా రెండు పార్టీలు దొందూదొందే అన్నట్లుగా ముందుకెళుతున్నాయి. దీని వల్ల ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజలని ఆకర్షించలేకపోతున్నారు. ఒకవేళ టీడీపీ నేతలు సబ్జెక్ట్ పరంగా...ఎలాంటి దారుణ విమర్శలు చేయకుండా మాట్లాడితే వైసీపీ నుంచి ఎదురుదాడి వచ్చేది కాదనే చెప్పాలి.

అయితే టీడీపీలో సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాత్రం ఆ పని చేయగలుగుతున్నారు. ఇక పయ్యావులకు రాజకీయంగా ఎంత సబ్జెక్ట్ ఉందో...ప్రత్యర్ధులకు సైతం తెలుసు. ఆయన గుడ్డిగా విమర్శలు చేయరు. ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై తప్పు చేస్తుంటే....ఆ తప్పుని పట్టుకుని, క్లియర్‌గా వివరిస్తారు. ఆ తప్పుని ఎలా సరిద్దుకోవాలో చెబుతారు. దాని వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో మాట్లాడతారు.

తాజాగా అదానీ సంస్థ అందించే సౌర విద్యుత్ ఏపీ డిస్కంలకు చేరేటప్పటికి ఎక్కువ ధర పడుతుందని పయ్యావుల వివరించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు  రూ.2.49 పైసలు కాదని, అది రూ.3.50 నుంచి రూ.4.50 వరకు పడే అవకాశం ఉందని వివరించారు. ఇదో స్కామ్ అని, ఇది తప్పు అని నిరూపిస్తే ప్రభుత్వానికి సారీ కూడా చెబుతానని అన్నారు...అయితే ప్రభుత్వం నుంచి పయ్యావులపై ఎదురుదాడి రాలేదు...అలా అని స్పష్టమైన సమాధానాలు కూడా రాలేదు. అంటే ఒక సబ్జెక్ట్‌తో ప్రత్యర్ధులకు ఎలా చెక్ పెట్టొచ్చో పయ్యావులకు బాగా తెలుసు...అందుకే మిగిలిన టీడీపీ నేతల వల్ల వైసీపీకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా పయ్యావుల వల్ల చిక్కులు తప్పవనే చెప్పొచ్చు.



పయ్యావులతోనే పెద్ద చిక్కులాగా ఉంది?

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>