PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-9a4f304c-52c7-4675-addf-4e1ea17bdf6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-9a4f304c-52c7-4675-addf-4e1ea17bdf6f-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఇక బీజేపీని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఆ మాత్రం ఇప్పటివరకు ఎందుకు ఆగినట్టు అనేదానికి మాత్రం సమాధానం చెప్పలేదు. ఆయనే ఒకసారి నెమ్మదిస్తాడు, ఆయనే మరోసారి ఉద్రేకపడతాడు, ఇంతకీ ఇదంతా ఉపఎన్నికలో ఓడినందుకేనా లేక ఇంకోటేమైన ఉందా. పోనీ యుద్ధం చేద్దాం అనుకుంటూ ముందడుగు వేస్తే ఆయనకు నష్టమా లాభమా.. ఇలాంటివి అన్ని ఆలోచించకుండానే ఇంత ప్రసంగం చేశారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. తెలంగాణ వచ్చినప్పటి నుండి పాలిస్తూ ఇప్పటివరకు ప్రజలకు చేసింది లేకపోగా kcrvsbjp,{#}bhavana,politics,Coronavirus,Party,war,Telangana,Bharatiya Janata Party,KCR,CM,Yevaruకేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!కేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!kcrvsbjp,{#}bhavana,politics,Coronavirus,Party,war,Telangana,Bharatiya Janata Party,KCR,CM,YevaruMon, 08 Nov 2021 10:19:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఇక బీజేపీని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఆ మాత్రం ఇప్పటివరకు ఎందుకు ఆగినట్టు అనేదానికి మాత్రం సమాధానం చెప్పలేదు. ఆయనే ఒకసారి నెమ్మదిస్తాడు, ఆయనే మరోసారి ఉద్రేకపడతాడు, ఇంతకీ ఇదంతా ఉపఎన్నికలో ఓడినందుకేనా లేక ఇంకోటేమైన ఉందా. పోనీ యుద్ధం చేద్దాం అనుకుంటూ ముందడుగు వేస్తే ఆయనకు నష్టమా లాభమా.. ఇలాంటివి అన్ని ఆలోచించకుండానే ఇంత ప్రసంగం చేశారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. తెలంగాణ వచ్చినప్పటి నుండి పాలిస్తూ ఇప్పటివరకు ప్రజలకు చేసింది లేకపోగా ఇంకా అన్నిటికి కేంద్రంపై నిందలు మోపుతూ ఇన్నేళ్లు కప్పిపుచ్చుకున్నారు. ఇలా ఇంకెన్నాళ్లు, ప్రజలు కూడా తెలుసుకున్నారు, కేసీఆర్ మాటలతో మోసం చేస్తున్నాడు అని. కానీ ఇంకా కేసీఆర్ సారుకి ఆ విషయం అర్ధం అయినట్టు లేదు.

బీజేపీ మూడు స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఇంకా ప్రజలను పిచ్చోళ్లను చేస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. అందుకే తాజా ఉపఎన్నికలో కూడా తమకు నమ్మకం ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకున్నారు. ప్రాంతీయ పార్టీపై నమ్మకం పోయిందంటేనే మీ పాలన ఎలా ఉన్నదనే అంచనా మీరు వేసుకోవాలి. అది చేయకుండా ఇంకా వేరే వాళ్లపై నిందలు వేస్తూ పోతే ఇంకెప్పటికీ ఫలితాలు అనుకూలంగా రావు. కళ్ళు తెరుచుకొని ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపితే అప్పుడు ఏమైనా ఫలితం ఉంటుంది. కాదు, ఇంతే ఉంటాం అంటే ప్రజలు కూడా వేరే పార్టీని చూసుకుంటారు.

అసలు అవకాశం లేని చోటనే చొరబడే పార్టీ బీజేపీ, అలాంటిది ప్రభుత్వంలో బోలెడు లోపాలు ఉన్న తెలంగాణాలో చొరబడటం కాదు దూసుకుపోతుంది బీజేపీ. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం సడలిపోయింది. ఇన్నాళ్లు నమ్మి మోసపోయాం అని ప్రజలు భావిస్తున్నారు. ఆ భావన వచ్చేవరకు తెచ్చుకుంది అధికార పార్టీనే. దానికి అనుభవించాల్సిందే కదా మరి. అదే ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి. ఇప్పటి బీజేపీ ప్రజా వ్యతిరేక పనులు చేయడం లేదు, అధిక ధరలు కరోనా కారణంగా తప్పదు. ఇవన్నీ ప్రజలు నెమ్మదిగా గ్రహిస్తున్నారు. కానీ వాటిని పెద్దదిగా చేసి విపక్షాలు యాగీ చేస్తున్నారని ప్రజలకు అర్ధం అవుతుంది. అందుకే ప్రజలకు ఏదైనా చేసి అప్పుడు మాట్లాడాలి. ఇంకా కుళ్ళు రాజకీయాలు చేస్తే వృధా.


కేసీఆర్ నయా టార్గెట్ బీజేపీ...!

కేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!

ఫ్లైఓవర్ లు కూడా.. సంస్థల కోసమేనా..!

రేపు ఒడిశా-ఏపీ సీఎంలు భేటీ

చైనా కబ్జా చేస్తుంది.. అమెరికా స్పష్టికరణ..!

బీజేపీపై.. కేసీఆర్ యుద్దమా..!

ఈటల పేరెత్తడానిక్కూడా ఇష్టపడని కేసీఆర్.. ఎందుకంటే..?

బిగ్ బాస్ 5: ఉత్కంఠ దశకు చేరుకున్న టైటిల్ వేట?

కేసీఆర్ వార్నింగ్.. ఇక బీజేపీకి చుక్క‌లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>