Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape7fdbab84-76be-4ae2-bc1d-3490f966ada6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape7fdbab84-76be-4ae2-bc1d-3490f966ada6-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం ఆలోచనా తీరు ఎటుపోతోంది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి నెలలు నిండని పసికందుల నుంచి పండు ముదుసలి వరకు కూడా అందరిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు మానవ మృగాలు. అయితే మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు కామందుల తీరులో మాత్రం మార్పు తీసుకు రాలేకపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సభ్య సమాజంలో జరుగుతున్న Rape{#}School;students;Bhadradri;police;Districtబడికెళ్లే బాలుడిలో కామం.. చివరికి?బడికెళ్లే బాలుడిలో కామం.. చివరికి?Rape{#}School;students;Bhadradri;police;DistrictSat, 06 Nov 2021 15:00:00 GMTనేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూస్తుంటే సభ్య సమాజం ఆలోచనా తీరు  ఎటుపోతోంది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి  నెలలు నిండని పసికందుల నుంచి పండు ముదుసలి వరకు కూడా అందరిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు మానవ మృగాలు. అయితే మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు కామందుల తీరులో మాత్రం మార్పు తీసుకు రాలేకపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సభ్య సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడం.. ఇక సమాజం లో కొత్త మార్పు తీసుకురావడం  రాబోయే తరానికి సాధ్యమవుతుందని ఎంతోమంది కూడా నమ్ముతున్నారు.


 కానీ ఇటీవలి కాలంలో చూసుకుంటే ఏకంగా స్కూల్ సమయంలోనే ఎంతోమంది విద్యార్థులు పెడదోవ  పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బుద్ధిగా చదువుకోవాల్సిన సమయంలో ఏకంగా కామంతో ఊగిపోతున్నారు ఎంతోమంది విద్యార్థులు. చివరికి ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి . ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. 3,5 వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై 8, 9 వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఇక పక్కనే కొంతమంది స్థానికులు చూసి మందలించడంతో ఇద్దరు బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే స్థానికులు బాలికల తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.



కేవలం వాటి కోసమే 85 కోట్లు ఖర్చు చేసిన రాధే శ్యామ్ నిర్మాతలు..!

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>