PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/beijing81addce2-0861-4bee-86fc-cd85b450805e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/beijing81addce2-0861-4bee-86fc-cd85b450805e-415x250-IndiaHerald.jpgకాలుష్యం చైనా రాజధాని బీజింగ్ నగరాన్ని కమ్మేసింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.... కనీసం 200 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కాని కంటికి కనిపించడం లేదు. పరిస్థితి అత్యంత దారుణంగా తయరవ్వడంతో... చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలో బీజింగ్ నగరం చుట్టు పక్కల ఉన్న అన్ని జాతీయ రహదారులను కూడా చైనా ప్రభుత్వం మూసి వేసింది. ఎలాంటి రాకపోకలు సాగించరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఇక వాయు కాలుష్యం అధికంగbeijing{#}vehicles;Beijing;Capital;air pollution;Air;Governmentకాలుష్యం కోరల్లో చైనా... అన్నీ బంద్..!కాలుష్యం కోరల్లో చైనా... అన్నీ బంద్..!beijing{#}vehicles;Beijing;Capital;air pollution;Air;GovernmentFri, 05 Nov 2021 13:48:13 GMTకాలుష్యం చైనా రాజధాని బీజింగ్ నగరాన్ని కమ్మేసింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.... కనీసం 200 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కాని కంటికి కనిపించడం లేదు. పరిస్థితి అత్యంత దారుణంగా తయరవ్వడంతో... చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలో బీజింగ్ నగరం చుట్టు పక్కల ఉన్న అన్ని జాతీయ రహదారులను కూడా చైనా ప్రభుత్వం మూసి వేసింది. ఎలాంటి రాకపోకలు సాగించరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఇక వాయు కాలుష్యం అధికంగా ఉండటంతో... ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్క్ ధరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది చైనా. మరోవైపు చలికాలం కూడా కావడంతో... విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో వాయు కాలుష్యంపై మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది బీజింగ్ నగర పాలక సంస్థ. అలాగే నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించింది. చిన్నారులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది.

ఓ వైపు మంచు, మరోవైపు కట్టడాల నిర్మాణం, ఇంకో వైపు పరిశ్రమల నుంచి వచ్చే పొగ కారణంగా వాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే గాలి నాణ్యతా సూచి కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎదుటి వ్యక్తి కూడా కనిపించలేని స్థాయికి వాయు కాలుష్యం చేరుకుంది. బీజింగ్, త్యాన్ జిన్, హెబిల్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున పొగ వస్తుందని... ఇది వాయు కాలుష్యానికి కారణమవుతుందని నిపుణులు వెల్లడించారు. అటు సైబిరియా నుంచి చల్లని గాలులు కూడా బీజింగ్ వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని 64 నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ చైనా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే... ప్రజలు ఉపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడటం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.



ఏపీ లోక‌ల్ వార్‌: టీడీపీకి ఆ రెండు చోట్లా ఆశ‌లు ఉన్నాయా ?

భార్యకు వీడియో​ కాల్‌ చేసి జైలు వార్డెన్‌ ఆత్మహత్య

గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్ లో కీలక విషయాలు

తిరుప‌తి మాజీ ఎంపీ చింతామోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఏమన్నారంటే..?

హాలీవుడ్ రేంజ్ లో హృతిక్ రోషన్ స్టామినా

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక డిలీట్ టైం పెరుగుతుంది?

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం..!

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>