HealthChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/britanmolnupiravir-3cace8c0-20d6-4167-be46-c2d1edca0f68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/britanmolnupiravir-3cace8c0-20d6-4167-be46-c2d1edca0f68-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించి దాదాపు రెండు ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి కొన్ని దేశాలు విలవిలలాడుతూనే ఉన్నాయి. కాస్త తగ్గిందనే ఉద్దేశ్యంతో ప్రజలు కూడా నెమ్మదిగా పనులలోకి వెళ్తున్నారు, అయితే అంతలోనే మరోసారి వ్యాప్తి చెందటం ప్రారంభించింది. దీనితో ప్రపంచంలో కూడా మరొకసారి తాజాగా అలర్ట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా సమస్య ఇంకా తీరలేదు, కాస్త అందరు తగిన జాగర్తలు పాటిస్తూ ఉండాలని సూచించింది. ప్రతిసారి కొత్త వేరియంట్లు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయని, దbritanmolnupiravir;{#}Coronavirusకరోనా ఔషధాలలో.. మరొకదానికి స్థానం..!కరోనా ఔషధాలలో.. మరొకదానికి స్థానం..!britanmolnupiravir;{#}CoronavirusFri, 05 Nov 2021 14:58:53 GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించి దాదాపు రెండు ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి కొన్ని దేశాలు విలవిలలాడుతూనే ఉన్నాయి. కాస్త తగ్గిందనే ఉద్దేశ్యంతో ప్రజలు కూడా నెమ్మదిగా పనులలోకి వెళ్తున్నారు, అయితే అంతలోనే మరోసారి వ్యాప్తి చెందటం ప్రారంభించింది. దీనితో ప్రపంచంలో కూడా మరొకసారి తాజాగా అలర్ట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా సమస్య ఇంకా తీరలేదు, కాస్త అందరు తగిన జాగర్తలు పాటిస్తూ ఉండాలని సూచించింది. ప్రతిసారి కొత్త వేరియంట్లు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయని, దీనికి కారణం కూడా ప్రజలు కనీస కరోనా నిబంధనలు పాటించకపోవడమే అని ఆ సంస్థ పేర్కొంది. మందులు ఎన్ని ఉన్నప్పటికీ నిబంధనలు మాత్రమే కరోనా నుండి పూర్తిగా రక్షించగలవు అనేది ప్రజలు తెలుసుకొని ప్రవర్తిస్తేనే ప్రపంచం నుండి ఈ వైరస్ ను తరిమేయడానికి సాధ్యం అవుతుంది.

ఇప్పటీ ప్రపంచదేశాలు ఆయా టీకాల ద్వారా కరోనా నుండి రక్షణగా వారివారి పౌరులకు వయసును బట్టి అందిస్తున్నారు. ప్రస్తుతం మూడో వేవ్ అని చెప్పినప్పటికి, ఆ వేవ్ లో పిల్లలమీద ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పినప్పటికీ, ఆ పిల్లల నుండి పెద్దలకు సంక్రమణ జరుగుండటం వలన కేసులు విపరీతంగా బయటపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే జాగర్తలు పాటించడం తప్ప మరో విధమైన పరిష్కారం లేదని వారు సూచిస్తున్నారు. అయితే టీకాల ప్రయోజనం మాత్రం కేవలం ఆ వైరస్ ప్రాణాంతకం కాకుండా ఉండేందుకే అనేది ప్రజలు గుర్తెరగాలి. ప్రస్తుతం ఎన్ని ఔషదాలు అందుబాటులో ఉన్నప్పటికీఅవన్నీ ప్రాణాలు నిలపడానికి తప్ప శాశ్వతంగా వైరస్ ను హరించలేవు.

తాజాగా కరోనా వైరస్ ఔషధాలలో మరొకటి స్థానాన్ని సంపాదించుకుంది. ఈసారి ఔషధం మాత్ర(టాబ్లెట్) రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీనిని అన్నిటి లాగానే నోటిద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మొల్నుపిరవిర్ గా ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని మార్క్, రిట్జ్ బ్యాక్ బయోథెరపిటిక్ సంస్థలు సంయుక్తంగా తయారుచేశారు. దీని వినియోగానికి బ్రిటన్ కూడా ఆమోదం తెలిపింది. దీనిని కరోనా లక్షణాలు బయటపడిన ఐదు రోజుల లోగా వాడాల్సి ఉంటుంది. ఈ తరహా వాడకానికి మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రేగులటరీ ఏజెన్సీ ఆమోదం కూడా తెలిపింది. కరోనా ప్రారంభ మరియు తరువాతి దశలలో ఈ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నివేదికలు చెపుతున్నాయి. ఇది కూడా రోగి వైరస్ వలన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. శాశ్వతంగా వైరస్ ను రూపుమాపలేదు.



నోట్లు రద్దయ్యి ఐదేళ్లు అవుతున్నా ఆశించిన ఫలితాలు లేవు..

విరాట్ కోహ్లీ కీపింగ్ కూడా చేశాడు.. ఎప్పుడో తెలుసా?

నెల్లూరు టీడీపీలో ఇంత గంద‌ర‌గోళ‌మా...!

వామ్మో.. అమెజాన్ లో కవర్ ఆర్డర్ చేస్తే.. పాస్పోర్ట్ వచ్చింది?

ఢిల్లీలో గ‌తం కంటే త‌గ్గిన అగ్నిప్ర‌మాదాలు..!

ఏపీ లోక‌ల్ వార్‌: టీడీపీకి ఆ రెండు చోట్లా ఆశ‌లు ఉన్నాయా ?

మంచిమాట: ఏదైనా సరే ముందుగా ఆలోచించి ఆచరించాలి..!!

మలయాళ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న నివిన్..!!

భార్యకు వీడియో​ కాల్‌ చేసి జైలు వార్డెన్‌ ఆత్మహత్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>