PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-869f7e9a-e253-4781-809c-eef17a292525-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-869f7e9a-e253-4781-809c-eef17a292525-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావటం, ఆయనపై టిఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం ఈ బరిలో నిలిచారు. అయితే వీరిలో కొందరు ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇక హుజురాబాద్ జనం ఎవరి పక్షం వహించారు అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీ నేతలు అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లైమ్ చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలు ఈటెల గెలుపు తథ్యంPolitical {#}Eatala Rajendar;Santosham;Karimnagar;Degree;Indian Postal Service;Huzurabad;Evening;Government;Telugu;రాజీనామా;Minister;Party;MLAసగంలోనే తేలనున్న హుజురాబాద్ భవిష్యత్తు.. ఎలా అంటే..?సగంలోనే తేలనున్న హుజురాబాద్ భవిష్యత్తు.. ఎలా అంటే..?Political {#}Eatala Rajendar;Santosham;Karimnagar;Degree;Indian Postal Service;Huzurabad;Evening;Government;Telugu;రాజీనామా;Minister;Party;MLAMon, 01 Nov 2021 21:25:00 GMTనువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఈ ఫలితాల్లో ఐదారు నెలల ఉత్కంఠకు తెర పడింది. హుజరాబాద్ బాద్ షా ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోతుంది. కొద్ది నెలలుగా ఉత్కంఠ రేపుతున్న హుజరాబాద్ ఉప ఎన్నిక పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి అరగంటలో పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఓట్ల లెక్కింపు కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 22 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం వరకు తుది ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో హాల్లో 7 టేబుల్ల చొప్పున ప్రతి రౌండ్ కు 14 టేబుల్స్ పై 14 ఈవీఎంలను లెక్కిస్తారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు ముడి పెట్టడం తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈసారి అనూహ్యంగా పోలింగ్ శాతం పెరగడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెరిగిన ఈ పోలింగ్ పర్సంటేజ్ ఏ పార్టీ కొంప ముంచుతుందోనన్న భయం రాజకీయ పార్టీలను కుదిపేస్తోంది. గతంలో ఏ ఉపఎన్నికలో ఇంతటి భారీ పోలింగ్ నవోదవలేదని ఎన్నికల  అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో 90 శాతానికి పైగా పోలింగ్  నమోదవడం గమనార్హం. టిఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్  పై అవినీతి ఆరోపణలు రావటం, ఆయనపై టిఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం ఈ బరిలో నిలిచారు.

అయితే వీరిలో కొందరు ఆ తర్వాత వెనక్కి తగ్గారు.  ఇక హుజురాబాద్ జనం ఎవరి పక్షం వహించారు అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీ నేతలు అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లైమ్ చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలు ఈటెల గెలుపు తథ్యం అంటే మరికొన్ని సర్వేలు టిఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నాయి. మరికొద్ది గంటల్లో జరగనున్న కౌంటింగ్ లో హుజురాబాద్ బాద్ షా ఎవరో తేలిపోతుంది.



ఆ విషయంలో షాక్ అయిన నేహా శర్మ..!

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>