SpiritualityVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd8758ecfc-39fe-496e-946c-8a83919bc54e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/ttd8758ecfc-39fe-496e-946c-8a83919bc54e-415x250-IndiaHerald.jpgసామాజిక మాధ్యమాలలో తిరుమల తిరుపతి దేవస్థానం పై వస్తున్న ప్రచారంపై నమ్మవద్దని టిటిడి కోరింది. కోవిడ్-19 నిబంధనలు సడలించారంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. వృద్దులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లి తండ్రులకు ప్రత్యేక ప్రవేశం లేదని టిటిడి విజ్ఞప్తి చేసింది. 2020 మార్చి 20 నుంచి కోవిడ్ నిబంధనలసు అమలు చేస్తోందని తెలిపింది. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబ‌రు 20న బుధ‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు.ttd{#}Darshana;chanti;Tirupati;gold;2020;Coronavirus;March;Governmentమేము అలా చెప్పలేదంటున్నటిటిడిమేము అలా చెప్పలేదంటున్నటిటిడిttd{#}Darshana;chanti;Tirupati;gold;2020;Coronavirus;March;GovernmentTue, 19 Oct 2021 14:22:13 GMTమేము అలా చెప్పలేదంటున్నటిటిడి

కోవిడ్-19 నిబంధనల అమలులో ఎలాంటి మార్పులు చేయలేదని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కోంది. కోరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుగుణంగా టిటిడి నడుచుకుంటోందని  2020  మార్చి 20 నుంచి కోవిడ్  నిబంధనలసు అమలు చేస్తోందని తెలిపింది. చంటి పిల్లల దర్శనాలను పునరుద్ధరించ లేదని  స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలోనే తెలిపామనింది. వృద్దులు , వికలాంగుల దర్శనాల విషయంలోనూ అప్పటి స్థితి నె కొనసాగిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అదికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణకు రాలేదని, అందువల్ల ప్రత్యేక భక్తులకు దర్శనాల విషయంలో నాటి స్థితే కొనసాగుతోందని తెలిపింది.  సామాజిక మాధ్యమాలలో దివ్యాంగులకు, వృద్ధల విషయంలో అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని, వీటని నమ్మవద్దని టిటిడి కోరింది. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని టిటిడి సామాజిక మాధ్యమాలను కోరింది.  అసత్యమైన సమాచారాన్ని  ప్రజలకు అందజేయడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందని తెలిపింది. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లవద్దని టిటిడి కోరింది.

అక్టోబ‌రు 20న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబ‌రు 20న బుధ‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంట‌ల వరకూ మలయప్ప స్వామి సర్వాలంకార భూషితుడైన బంగారు గ‌రుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు.

శ్రీ‌వారిమెట్టు లోని శ్రీనివాస స్వామికి అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ  
 శ్రీ‌వారి మెట్టు .... తిరుమల కొండకు వెళ్లే నడక దారి.  శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీవారి మెట్టు  వద్ద గ‌ల వేంకటేశ్వర స్వామి  ఆలయంలో మహాసంప్రోక్షణ, అష్టబంధన కార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. యాగ‌శాల‌లో ఉదయం  వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. బుధ‌వారం భోగ‌శ్రీ‌నివాస‌మూర్తిని ప్ర‌తిష్టిస్తారు. ఈ  నేప‌థ్యంలో ఉద‌యం అభిషేకం, స్న‌ప‌న‌తిరుమంజ‌నం తో పాటు,  క్షీరాధివాసం నిర్వ‌హించారు. అక్టోబ‌రు 20న‌ మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహ‌న అర్చ‌న  తదితర కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.  ఆ తరువాత ఉద‌యం 11 గంట‌ల‌ ప్రాంతంలో మ‌హాసంప్రోక్ష‌ణ జ‌రుగ‌నుంది.





రాజకీయ నాయకురాలుగా తన సత్తా చాటిన జయప్రద..!!

చంద్ర‌బాబు ప్లెక్సీకి అంత్య‌క్రియ‌లు

శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం..

తగ్గేదేలే :రాకేట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్ ధరలు..!

"హరి హర వీరమల్లు"లో పవన్ కళ్యాణ్ కొడుకు?

అమ్మబాబోయ్ ఇంత పెరిగిందా ?

బీజేపీకి షాక్.. ప్రచారానికి వారందరూ దూరం?

కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..?

హమ్మయ్యా.. జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>