PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/you-are-from-hyderabad-but-do-not-go-that-route8ab02480-f640-4b56-9bd8-093bda5de917-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/you-are-from-hyderabad-but-do-not-go-that-route8ab02480-f640-4b56-9bd8-093bda5de917-415x250-IndiaHerald.jpgముస్లిం సహోదరులు మొహర్రం పండుగకు సిద్ధమవుతున్నారు. అటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ నెల 20న సేలవు దినంగా ప్రకటించాయి. కరోనా నిబంధనలు తప్పటించాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. అటు మొహర్రంను పురస్కరించుకొని హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. You are from Hyderabad but do not go that route{#}Kumaar;Telangana;Hyderabad;Andhra Pradesh;police;Coronavirus;Governmentమీరు హైదరాబాద్ వాసులా.. అయితే ఆ రూట్ లో వెళ్లకండి..!మీరు హైదరాబాద్ వాసులా.. అయితే ఆ రూట్ లో వెళ్లకండి..!You are from Hyderabad but do not go that route{#}Kumaar;Telangana;Hyderabad;Andhra Pradesh;police;Coronavirus;GovernmentThu, 19 Aug 2021 12:46:00 GMTహైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. రేపు ఉదయం 11నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని పోలీసులు తెలిపారు. మొహర్రంను పురస్కరించుకొని రేపు పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు జరుగనుంది.డబీరాపురాలోని బీబీకాఆలం నుంచి ఊరేగింపు ప్రారంభం కానుంది. చాదర్ ఘాట్ వరకు ఈ ఊరేగింపు కొనసాగనుంది.

ముస్లింల పర్వదినం మొహర్రంకు ప్రభుత్వ సాధారణ సెలవు ఈ నెల 20న ఉంటుందని సీఎస్ సోమేశ్ కుమార్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. 19న ఆప్షనల్ హాలిడే అని పేర్కొన్నారు. మొహర్రం సెలవు 19న అని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. అయితే.. మొహర్రం ఈ నెల 20న నిర్వహించుకుంటున్నారని.. అందువల్ల ఈ రోజు సెలవు ఇవ్వాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో ప్రభుత్వానికి నివేదించారు. దీంతో సెలవు మార్చారు.

ఇక మొహర్రం పండుగకు సంబంధించి ప్రభుత్వ సాధారణ సెలవు ఈ నెల 20న ఉంటుందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. గతంలో ఈ నెల 19న సెలవు అని ప్రభుత్వం ప్రకటించగా.. పండుగను ఈ నెల 20న జరుపుకుంటున్నామని.. ఆ రోజు సెలవు ఇవ్వాలని ముస్లిం ఉద్యోగుల విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ నెల 20న సెలవు ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల 20న సెలవును ప్రకటించింది.

మొహర్రం కారణంగా ఏపీ ప్రభుత్వం పలు మార్గదర్శకాలు వెల్లడించింది. 10మంది కంటే మించకుండా ఆలం నిర్వహణకు పర్మీషన్ ఇచ్చింది. ఇక ఊరేగింపు విషయానికొస్తే.. 30 నుంచి 40 మందికే అనుమతి ఇచ్చింది. మంచి నీరు తప్ప మిగతావేవీ వితరణకు అనుమతి లేదని వెల్లడించింది. ఇక కరోనా నిబంధనలు తప్పనిసరని చెప్పింది. మాస్క్ లు, శానిటైజర్ల, భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. మరోవైపు సెకండ్ వేవ్ ముగిసిందని ప్రకటించిన తెలంగాణ ఆరోగ్య శాఖ.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 18ఏళ్లు నిండినవారంతా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపింది.














 


బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>