PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/uma-told-before-on-lokesh-arrest5e4c1db2-bc9a-4054-a8bf-4333ca4ad663-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/uma-told-before-on-lokesh-arrest5e4c1db2-bc9a-4054-a8bf-4333ca4ad663-415x250-IndiaHerald.jpgజగన్‌ నెక్ట్స్‌ టార్గెట్ లోకేశ్‌ అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పి పది రోజులు కూడా గడవకముందే ఆయన చెప్పిందే నిజమైందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయంగా గట్టి వాదనలే వినిపిస్తున్నారు. ఎందుకంటే.. గుంటూరులో యువకుడి ఉన్మాదత్వానికి బలైన విద్యార్థిని రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌ను కావాలనే అరెస్ట్‌ చేశారని అంటున్నారు. లేదంటే పరామర్శకు వెళ్లిన నాయకుడిని అరెస్‌ చేయడం ఏమిటి? అని వారు ప్రశ్నిస్తునuma told before on lokesh arrest{#}CBN;Lokesh;Telugu Desam Party;devineni avinash;Lokesh Kanagaraj;Rajahmundry;TDP;Party;YCP;Minister;Andhra Pradeshలోకేశ్‌ అరెస్ట్‌పై ఉమ చెప్పిందే నిజమైంది!లోకేశ్‌ అరెస్ట్‌పై ఉమ చెప్పిందే నిజమైంది!uma told before on lokesh arrest{#}CBN;Lokesh;Telugu Desam Party;devineni avinash;Lokesh Kanagaraj;Rajahmundry;TDP;Party;YCP;Minister;Andhra PradeshMon, 16 Aug 2021 17:43:00 GMTజగన్‌ నెక్ట్స్‌ టార్గెట్ లోకేశ్‌ అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పి పది రోజులు కూడా గడవకముందే ఆయన చెప్పిందే నిజమైందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయంగా గట్టి వాదనలే వినిపిస్తున్నారు. ఎందుకంటే.. గుంటూరులో యువకుడి ఉన్మాదత్వానికి బలైన విద్యార్థిని రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌ను కావాలనే అరెస్ట్‌ చేశారని అంటున్నారు. లేదంటే పరామర్శకు వెళ్లిన నాయకుడిని అరెస్‌ చేయడం ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఏపీలో జగన్‌ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్‌ నేతలు జైళ్లకు క్యూ కడుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతో మొదలైన జగన్‌ సర్కార్‌ వేధింపుల పర్వం రోజురోజుకు ముదిరి దాడులు, అరెస్టులకు దారితీసింది. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్‌ కూడా జరిగింది. ఆయన బెయిల్‌పై తిరిగొచ్చే సమయంలో పోలీసులే పరోక్షంగా ఆయనకు విపరీతమైన ప్రచారం కల్పించారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన దేవినేని ఉమ బాంబు పేల్చారు. అప్పుడది తెలుగుదేశంలో హాట్‌టాపిక్‌ అయింది.

దేవినేని ఉమామహేశ్వరరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన వెంటనే ఆయనతో ఫోన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన బాంబు పేల్చారు. సెప్టెంబర్‌లో  లోకేశ్‌ను అరెస్టు చేస్తారని చెప్పారు.కేసులేమీ లేవు కదా... తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని చంద్రబాబు కుుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఎవరూ తప్పు చేయలేదని, కావాలనే కేసులు పెడుతున్నారని కూడా ఉమ వారికి వివరించారు. లోకేష్ మాత్రం తాను అన్నింటికీ సిద్దంగా ఉన్నానని, ఇప్పటికే ఈ అంశాన్ని కుటుంబ సభ్యులకు కూడా వివరించానని, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు చంద్రబాబు కూడా.. ఎటువంటి పరిణామాలను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే లోకేశ్‌ను అరెస్ట్‌ చేయడంతో.. దేవినేని ఉమ చెప్పిందే నిజమైందన్న చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతోంది. అయితే ఏపీ ఫైబర్‌ నెట్‌ వ్యవహారంలో లోకేశ్‌ను అరెస్ట్‌ చేస్తారని దేవినేని ఉమ చెప్పారు. కానీ పరామర్శకు వెళ్లిన లోకేశ్‌ను అరెస్ట్‌ చేయడం జగన్‌ ప్రభుత్వ దిగజారుడుతనం, కక్షపూరిత చర్యలకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.



సినీ ప్రముఖులకు జగన్ పిలుపు... అసలు కథ ఇదేనా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>