HistoryMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-4add5fd4-dc14-49d5-8f77-a19ebd4018e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-4add5fd4-dc14-49d5-8f77-a19ebd4018e7-415x250-IndiaHerald.jpgకొత్తగా స్వతంత్ర దేశంలో జాతీయ సమైక్యతకు అతని నిబద్ధత పూర్తిగా మరియు రాజీలేనిదని అతనికి "ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే పేరు కూడా వచ్చింది. ఆధునిక అఖిల భారత సేవల వ్యవస్థను స్థాపించినందుకు అతడిని "భారత పౌర సేవకుల పోషకుడిగా" కూడా గుర్తించారు. అలాగే అతడిని "భారత యూనిఫైయర్" అని కూడా అంటారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం, 2018 వ సంవత్సరం అక్టోబర్లో అతనికి ఒక విగ్రహాన్ని అంకితమిచ్చారు. ఇది దాదాపు 182 మీటర్లు అడుగులు ఎత్తు ఉంటుంది. ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ రాజకీయాలను ప్రభావHistory {#}Bhuma Akhila Priya;Sardar Vallabhai Patel;Gujarat - Gandhinagar;Punjab;District;India;Congress"ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా " అని ఎవరిని అంటారో తెలుసా..?"ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా " అని ఎవరిని అంటారో తెలుసా..?History {#}Bhuma Akhila Priya;Sardar Vallabhai Patel;Gujarat - Gandhinagar;Punjab;District;India;CongressWed, 11 Aug 2021 11:57:03 GMTసర్దార్ వల్లభభాయి పటేల్ నాడియాడ్ జిల్లా ఖేడాలో జన్మించాడు మరియు గుజరాత్ రాష్ట్రంలోని  గ్రామీణ ప్రాంతంలో పెరిగాడు. అతను పెద్ద న్యాయవాదిగా పేరు పొందాడు.  అతను తదనంతరం గుజరాత్‌లోని ఖేడా, బోర్సాద్ మరియు బార్డోలి నుండి రైతులను అరాచక పాలన పై సమావేశం  నిర్వహించాడు. బ్రిటిష్ రాజ్‌కి వ్యతిరేకంగా అహింసాత్మక శాసనోల్లంఘనలో పాల్గొన్నాడు. గుజరాత్‌లో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా పేరుపొందాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు 1934 మరియు 1937 లో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించాడు. తర్వాత  భారత జాతీయ కాంగ్రెస్ 49 వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారతదేశపు మొట్టమొదటి హోం మంత్రిగా మరియు ఉప ప్రధానమంత్రిగా పదవులు అలంకరించి, ఎన్నో మంచి పనులు చేశాడు.

 పటేల్ పాకిస్తాన్ నుండి పంజాబ్ మరియు ఢిల్లీకి పారిపోతున్న శరణార్థుల కోసం సహాయక చర్యలను నిర్వహించి శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేశారు. అతను ఏకీకృత భారతదేశాన్ని ఏర్పాటు చేసే పనికి నాయకత్వం వహించాడు.  కొత్తగా డొమినియన్ ఆఫ్ ఇండియాగా ఏర్పడిన బ్రిటిష్ వలస ప్రావిన్సులను కొత్తగా స్వతంత్ర దేశంలోకి విజయవంతంగా విలీనం చేయగలిగాడు.  ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రావిన్సులు కాకుండా, దాదాపు 566 స్వయం పరిపాలన సంస్థానాలు 1947 భారత స్వాతంత్ర్య చట్టం ద్వారా బ్రిటిష్ ఆధిపత్యం నుండి విడుదల చేయబడ్డాయి. పటేల్ దాదాపు ప్రతి రాచరిక రాష్ట్రాన్ని భారతదేశానికి చేరడానికి ఒప్పించారు.

కొత్తగా స్వతంత్ర దేశంలో జాతీయ సమైక్యతకు అతని నిబద్ధత పూర్తిగా మరియు రాజీలేనిదని అతనికి "ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే పేరు కూడా వచ్చింది. ఆధునిక అఖిల భారత సేవల వ్యవస్థను స్థాపించినందుకు అతడిని "భారత పౌర సేవకుల పోషకుడిగా" కూడా గుర్తించారు. అలాగే అతడిని "భారత యూనిఫైయర్" అని కూడా అంటారు.  స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం,  2018 వ సంవత్సరం అక్టోబర్లో అతనికి ఒక విగ్రహాన్ని  అంకితమిచ్చారు. ఇది దాదాపు 182 మీటర్లు  అడుగులు ఎత్తు ఉంటుంది. ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ఎంతో ఘనత సాధించారని చెప్పవచ్చు.



టీఆర్ఎస్‌లో ఎంపీలకు స్వేచ్ఛలేదు: బీజేపీ ఎంపీ అరవింద్‌

అబ్బా బాసు, ఏమి లుక్స్ ... మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>