PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taga07c737d-a17b-4516-bc9c-c034a00c49ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taga07c737d-a17b-4516-bc9c-c034a00c49ed-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఆర్థిక శాఖకు సంబంధించిన‌ కీలక వివరాలు లీక్ చేస్తున్నార‌నే అభియోగంతో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్, ఒక అసిస్టెంట్ సెక్రెటరీపై ఈ వేటు ప‌డింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ ముగ్గురు ఉద్యోగులు బ‌య‌ట‌కు లీక్ చేస్తున్నారని భావించిన ప్ర‌భుత్వం ఆర్థిక శాఖలో విధులు నిర్వ‌హిస్తున్న సెక్షన్ అధికారులు డి. శ్రీనిబాబు, కె.వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్లుపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. పtag{#}choudary actor;Telugu Desam Party;Andhra Pradesh;Minister;Government;central governmentఏపీ ఉద్యోగుల్లో రాజుకున్న నిప్పు?ఏపీ ఉద్యోగుల్లో రాజుకున్న నిప్పు?tag{#}choudary actor;Telugu Desam Party;Andhra Pradesh;Minister;Government;central governmentWed, 04 Aug 2021 10:46:06 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఆర్థిక శాఖకు సంబంధించిన‌ కీలక వివరాలు లీక్ చేస్తున్నార‌నే అభియోగంతో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్,  ఒక అసిస్టెంట్ సెక్రెటరీపై ఈ వేటు ప‌డింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ ముగ్గురు ఉద్యోగులు బ‌య‌ట‌కు లీక్ చేస్తున్నారని భావించిన ప్ర‌భుత్వం ఆర్థిక శాఖలో విధులు నిర్వ‌హిస్తున్న సెక్షన్ అధికారులు డి. శ్రీనిబాబు, కె.వరప్రసాద్, అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్లుపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచివెళ్లొద్ద‌ని ఆదేశించింది. ప్ర‌తిప‌క్షానికి స‌హ‌క‌రిస్తున్నార‌నే అనుమానాన్ని ప్ర‌భుత్వం వ్య‌క్త‌ప‌రుస్తోంది. వీరు కీల‌క స‌మాచారాన్ని ఎవ‌రికి పంపించారు? ఏయే మెయిళ్ల‌కు మెయిల్ చేశారు? స‌మాచారాన్ని స్వీక‌రించిన‌వారెవ‌రు? అనే కోణంలో ఉన్న‌తాధికారులు విచార‌ణ చేస్తున్నారు. ఉద్యోగుల‌ను కావాల‌నే స‌స్పెన్ష‌న్‌కు గురిచేశారంటూ స‌చివాల‌యంతోపాటు ఇత‌ర శాఖ‌ల్లోని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఎన్ని మ‌లుపుల‌కు కార‌ణం కానుందో చూడాలి.

ఏపీ అప్పుల‌పై ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు
కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్ర‌తిప‌క్ష‌నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అప్పుల‌కు సంబంధించిన అన్ని ఆధారాల‌ను చూపిస్తున్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌లే అప్పుల కోసం ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.41వేల కోట్ల ప్ర‌జాధ‌నానికి లెక్క‌లు లేవంటూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌భుత్వం ఖండిస్తోంది. అప్పు అనేది ప్ర‌భుత్వ పెద్ద‌ల కోసం కాద‌ని, సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికే అప్పులు చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

ఇప్ప‌టికే రూ.4వేల‌కోట్ల‌కు పైగా అప్పులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్ర‌స్తుత సంవ‌త్స‌రంలో త‌న పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్ప‌టికే పార్లమెంట్‌కు తెలియ‌జేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్య‌స‌భ‌లో అడిగిన ప్రశ్నలకు  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. 2020-21 ఏడాదికి రు.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా ఉంది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టంగా తెలిపింది. 15వ ఆర్థిక సంఘం అనుమతితో  2020-21 ఏడాదికి రూ. 30,305 కోట్లు అప్పు తీసుకోనుంది. అలాగే కొవిడ్‌ కారణంగా మరో రూ. 19,192 కోట్లు అప్పును ఏపీ ప్ర‌భుత్వం చేయ‌నుంది. ఈ వివ‌రాల‌న్నీ పంక‌జ్ చౌద‌రి తెలిపారు.







టీడీపీలో క్లారిటీ.. టికెట్ ఆ నేత‌కే అని బాబు సంకేతాలు..!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>