PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp74b49cc6-c0ed-4201-a0cd-5985c11cc6e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp74b49cc6-c0ed-4201-a0cd-5985c11cc6e3-415x250-IndiaHerald.jpgగ‌త కొద్ది కాలంగా దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా కార‌ణంగా రాష్ట్రాల‌కు కేంద్రం అందించే సాయం గురించి ఎవ్వ‌ర‌యినా మాట్లాడితే బాగుంటుంది. ఆర్థిక ప్యాకేజీలు ఎలానూ స‌హ‌క‌రించ‌లేదు క‌నుక ఈ విష‌య‌మై కేంద్రాన్ని నిల‌దీస్తే బాగుంటుంది. అలానే క‌రోనా కార‌ణంగా రోడ్డున ప‌డ్డ సామాన్య కుటుంబాల‌కు చేయూత ఇచ్చేలా కేంద్రం ఏద‌యినా ప‌థ‌కం ప్రక‌టించేలా చేస్తే ఇంకా బాగుంటుంది. కాంగ్రెస్ తో స‌హా విప‌క్షాలు అన్నీ బీజేపీకి అనుగుణంగా ప‌నిచేస్తున్నాయ‌న్న అప‌వాదు ఒక‌టి వినిపిస్తుంది...రాజ‌కీయ ప‌రిశీల‌కుల నుంచి.... bjp{#}Corporate;Krishna River;Congress;MP;Ministerఈ దేశ పార్ల‌మెంట్ సామాన్యుడ్ని మ‌రిచిపోయిందా?ఈ దేశ పార్ల‌మెంట్ సామాన్యుడ్ని మ‌రిచిపోయిందా?bjp{#}Corporate;Krishna River;Congress;MP;MinisterSun, 25 Jul 2021 12:30:57 GMTఈ దేశ పార్ల‌మెంట్ సామాన్యుడ్ని మ‌రిచిపోయిందా?

దేశం అంటే మ‌నుషులోయ్ అన్నారు.. మ‌రి మ‌నుషులు ఎలా ఉన్నారు.. వారి బాగోగులు చూడాల్సిన నాయ‌కులు ఎలా ఉన్నా రు.. సుమారు నెల రోజుల పాటుజ‌రిగే వ‌ర్షకాల స‌మావేశాలు సంద‌ర్భంగా సామాన్యుడి గోడు ఏమ‌యినా వినిపిస్తుందా.. లేదా అన్న‌ది కీల‌కం. ఏదేమ‌యినా కార్పొరేట్ శ‌క్తుల ప్ర‌భావంతోనో స‌హ‌కారంతోనో అధికారం అందుకున్న పార్టీల‌కు  ఇప్పుడు క‌రోనా ముప్పు పెద్ద‌గా ప్ర‌మాదకారిగా తోచ‌డం లేదు.. పైగా ఆక్సిజ‌న్ అంద‌క ఒక్క మ‌ర‌ణం కూడా దేశంలో సంభ‌వించ‌లేద‌ని చెప్ప‌డం మ‌రో విచార‌క‌రం. సామాన్యుడు లేనిదే  వాడి గెలుపు లేనిదే ఈ దేశం లేద‌న్న సంగ‌తి మ‌రిచిపోతే ఎలా?

క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాలు దేశాన్ని అత‌లాకుత‌లం చేశాయి.. ధ‌ర‌లు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.. చేస్తున్నాయి.. మండి పోతున్న ధ‌ర‌లు గురించి మాట్లాడితే మేలు.. ఎండి పోతున్న పొలాలు గురించి మాట్లాడితే ఇంకా మేలు.. జీవితంలో కొన్ని అవ‌కాశాలు వ‌స్తాయి.. కొన్ని అదృష్టం ఇస్తుంది..కానీ మ‌న ఎంపీలు అవ‌కాశాన్ని వాడుకోవ‌డం లేదు..క‌లిసివ‌చ్చిన అదృష్టాన్ని వినియోగించుకోవ‌డం లేదు. ఫ‌లితంగా అత్యున్న‌త చ‌ట్ట‌స‌భలు హాయిగా కాలం గ‌డుపుతున్నాయి. కానీ ఎవ్వ‌రూ క‌ష్టం పై స్పందించ‌డం లేదు.. సామాన్యుడి దుఃఖంపై గొంతెత్త‌డం లేదు. ఎవ్వ‌రికీ అర్థం కానివి అంద‌రికీ అవ‌స‌రం లేనివి కొన్ని మాత్రం మాట్లాడుతున్నారు. క‌రోనా మృతుల‌కు ప‌రిహారం ఇవ్వ‌లేం అని కేంద్రం తేల్చిసినా మాట్లాడ‌డం లేదు. పోనీ పెట్రో ధ‌ర‌లు ఇంత‌గా మండిపోతుంటే మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. ఒక ఎంపీ అన‌ర్హ‌త వేటు ప్ర‌ధానాంశంగా మాట్లాడుతున్నారు వైఎస్సార్సీపీ  ఎంపీలు.. ఇది కూడా ఇప్పుడు అప్రాధాన్య‌మే.. కృష్ణా బోర్డు త‌గాదాపై కాస్త మాట్లాడిన ఎప్ప‌టిలానే సంబంధిత మంత్రి ఇచ్చిన వివ‌ర‌ణ ఏమంత స‌బ‌బుగా లేదు. ఇదిగో దండీగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి క‌నుక ఇక  ఆ త‌గాదా ఉండ‌నే ఉండ‌దు అని నిపుణులు చెబుతున్నారు. పోడియంలోకి దూసుకుపోవ‌డం ఒక్క‌టే పెద్ద ఘ‌న‌కార్యంగా భావిస్తే విప‌క్షాలు ఓడిపోయాయ‌నే భావించాలి. గ‌త కొద్ది కాలంగా దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా కార‌ణంగా రాష్ట్రాల‌కు కేంద్రం అందించే సాయం గురించి ఎవ్వ‌ర‌యినా మాట్లాడితే  బాగుంటుంది. ఆర్థిక ప్యాకేజీలు ఎలానూ స‌హ‌క‌రించ‌లేదు క‌నుక ఈ విష‌య‌మై కేంద్రాన్ని నిల‌దీస్తే బాగుంటుంది. అలానే క‌రోనా కార‌ణంగా రోడ్డున ప‌డ్డ సామాన్య కుటుంబాల‌కు చేయూత ఇచ్చేలా కేంద్రం ఏద‌యినా ప‌థ‌కం ప్రక‌టించేలా చేస్తే ఇంకా బాగుంటుంది. కాంగ్రెస్ తో స‌హా విప‌క్షాలు అన్నీ బీజేపీకి అనుగుణంగా ప‌నిచేస్తున్నాయ‌న్న అప‌వాదు ఒక‌టి వినిపిస్తుంది...రాజ‌కీయ ప‌రిశీల‌కుల నుంచి....





సాయంత్రానికి ఒక క్లారిటీకి వస్తా

ఈటెల పై పోటీకి ఆ రెడ్డి గారినే దింపుతున్న కెసిఆర్...?

కైకాల సత్యనారాయణకు KGF సినిమాకి మధ్య ఉన్న సంబంధం..

కృష్ణా నదికి వరద... ప్రాజెక్టులకు జలకళ

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోందా..?

కేటీఆర్ గారి సైన్యానికి ధన్యవాదాలు!

ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోతున్న సీఎం...? కూలిపోయినట్టే...?

మేము ప్రభుత్వ అధికారులమా.. బానిసలమా.?

బెజ‌వాడ టీడీపీలో ఎవ‌రు ఎవ‌రికి టార్గెట్‌... ఈ కొత్త ట్విస్టులేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>