PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/roja-jagancbcaf480-d960-44c5-aa76-755c9acd7e24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/roja-jagancbcaf480-d960-44c5-aa76-755c9acd7e24-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ... కాదు కాదు... రచ్చ రచ్చ... అవును... నామినేటెడ్ పదవులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొత్తం 135 మందికి అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే... ఓ ముగ్గురిని మాత్రం ఉన్న పదవుల నుంచి తొలగించారు. వాళ్లే నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా. Roja{#}Nagari;Vijayawada;Roja;Raccha;Cabinet;October;media;Jagan;YCP;Minister;CM;Andhra Pradeshరోజాతో పాటు ఆ ఇద్దరికి కూడా..రోజాతో పాటు ఆ ఇద్దరికి కూడా..Roja{#}Nagari;Vijayawada;Roja;Raccha;Cabinet;October;media;Jagan;YCP;Minister;CM;Andhra PradeshSat, 17 Jul 2021 20:41:05 GMTఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ... కాదు కాదు... రచ్చ రచ్చ... అవును... నామినేటెడ్ పదవులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొత్తం 135 మందికి అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే... ఓ ముగ్గురిని మాత్రం ఉన్న పదవుల నుంచి తొలగించారు. వాళ్లే నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా. ఈ ముగ్గురిని కూడా నామినేటెడ్ పదవుల నుంచి జగన్ తొలగించారు. వీరి పదవులను వేరే వారికి కేటాయించారు.
 
ఇంత వరకు బాగానే ఉన్నా... ఇప్పుడు అంతా వినిపిస్తున్న మాట మాత్రం ఒకటే... వీరి పరిస్థితి ఏమిటీ అనేది. రోజాకు ఫస్ట్ ఫేజ్ లోనే మంత్రిపదవి వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దక్కడంతో రోజాకు కార్పోరేషన్ పదవితో సరిపెట్టారు. కానీ రోజా, పెద్దిరెడ్డి మధ్య తొలి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అసలు రోజాకు మంత్రి పదవి రాకుండా చేసిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే టాక్ కూడా జోరుగానే వినిపించింది. ఇప్పుడు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించడంతో... పాపం రోజా అంటూ కూడా సోషల్ మీడియా తెగ ట్రోల్ చేస్తున్నారు.


అయితే రోజాతో పాటు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజాలను ఆయా కార్పోరేషన్ల పదవుల నుంచి తొలగించడం వెనుక జగన్ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదనే సీఎం జగన్ నిర్ణయంలో భాగంగానే ఈ ముగ్గురిని తొలగించారు. అయితే నామినేటెడ్ పదవి పోయినప్పటికీ... ముగ్గురికి సముచిత స్థానం ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ముందే జగన్ స్పష్టం చేశారు. మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత తొలగిస్తా అని అప్పుడే చెప్పారు. ఇందులో భాగంగానే రెండో విడత కేబినెట్ విస్తరణలో రోజాకు, మల్లాది విష్ణుకు, జక్కంపూడి రాజాకు కూడా మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.



బాబుకూ జగన్ కి అదే తేడా.... ?

జగన్ పాలన రెండేళ్ళు దాటింది. ఈ మధ్యలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీలో జగన్ ఏలుబడి జనాలకు కొత్త అనుభవాలను కలిగిస్తే విపక్షాలకు వింత అనుభవాలు కలిగాయి. జగన్ కి ఏమీ తెలియదని, పాలన చేతకాదని అనుకున్న వారు సైతం ఇపుడు ఆశ్చర్యంగానే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.

ఉద్యోగులకు షాక్.. ఇకనుంచి జీన్స్, టీ షర్ట్ నిషేధం?

జగన్ డిసైడ్ అయ్యారు.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి కీలక పదవి?

సమస్యల పరిష్కారమే సైబర్ యోదా లక్ష్యం : మహేష్ భగవత్

ఇకనుంచి శాస్త్రీయ పద్ధతిలో మానవ వ్యర్ధాల తరలింపు : కేటీఆర్

బిగ్ రివీల్... ఆ పాపులర్ షోకు హోస్ట్ సల్మాన్ కాదు...!!

కంటెంట్ క్రియేటర్లకు ఫేస్బుక్ నుంచి గుడ్ న్యూస్..

ఈ స్టార్ కిడ్స్ ఎంట్రీ గురించే ఫ్యాన్స్ వెయిటింగ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>