EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan42c1d69f-eed8-40c6-97b1-5ce0dbeedde7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan42c1d69f-eed8-40c6-97b1-5ce0dbeedde7-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్‌కు లోక్‌సభ సచివాలయం నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. సీఎం జగన్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. దీంతో వైసీపీ శిబిరంలో ఆనందం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో స్పీకర్jagan{#}Loksabha;Good news;Good Newwz;sunil;Anandam;MP;News;YCP;Party;CMజగన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స్పీకర్.. తలపోటు తప్పేనా..?జగన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స్పీకర్.. తలపోటు తప్పేనా..?jagan{#}Loksabha;Good news;Good Newwz;sunil;Anandam;MP;News;YCP;Party;CMFri, 16 Jul 2021 06:00:00 GMTఏపీ సీఎం జగన్‌కు లోక్‌సభ సచివాలయం నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. సీఎం జగన్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. దీంతో వైసీపీ శిబిరంలో ఆనందం కనిపిస్తోంది.


ఎందుకంటే.. ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో  స్పీకర్‌ను కోరుతోంది. మా ఎంపీపై అనర్హత వేయండి సార్ అంటూ అనేకసార్లు వైకాపా ఎంపీలు స్పీకర్‌ను కలిసి కంప్లయింట్ కూడా చేశారు. అంతే కాదు.. స్పీకర్ కార్యాలయం స్పీడ్‌గా నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు కూడా. అయినా పట్టు విడవకుండా ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి  స్పీకర్‌ను కలిసి  ఫిర్యాదు చేశారు.


పాత ఫిర్యాదుకు మరింత అదనపు సమాచారం జోడించి గట్టిగా కంప్లయింట్ ఇచ్చారు. దీంతో చివరకు  స్పీకర్ కార్యాలయం స్పందించక తప్పలేదు. కేవలం రఘురామ కృష్ణంరాజే కాదు.. ఇలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో ఇద్దరు ఎంపీలకూ నోటీసులు ఇచ్చారు. ఎంపీలు రఘురామ కృష్ణంరాజుతో పాటు మరో ఇద్దరు ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ కు కూడా నోటీసులు ఇచ్చేశారు.


అయితే ఈ నోటీసులతో ఏం జరుగుతుంది.. దీనికి రఘురామ ఎలా సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. రఘురామ సమాధానంతో స్పీకర్ సంతృప్తి చెందుతారా.. లేక.. వైసీపీ వాదనే సబబని భావిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. వైసీపీ చెప్పిందే కరెక్టని స్పీకర్ భావిస్తేనే.. ఆయనపై చర్యలు ఉంటాయి. చివరకు రఘురామపై వేటుపడినా జగన్‌ సర్కారుపై విమర్శలు మానతారన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు.. చూడాలి ఏం జరుగుతుందో మరి.



హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అచ్చెన్నకు చెక్ పెట్టేసినట్లేనా?

రేవంత్‌ని లైట్ తీసుకుంటే చిక్కులే...!

కేవలం 499/- తో ఓలా ఇ-బైక్స్ బుకింగ్స్.. త్వరపడండి..

జగనన్న కొత్త స్కీమ్..అందరికీ!

చినబాబు సీరియస్‌గా ఉన్నారు...కలిసొస్తుందా!

ఆ విషయంలో వైసీపీపై టీడీపీదే పైచేయి?

అయ్యో రామా.. ఎంత పనైంది?

భర్త స్వీపర్ గా పని చేసే ఆఫీసులోనే చీఫ్ గా భార్య... నెట్టింట వైరల్...

నక్క జిత్తుల చైనా కుట్రలను బయటపెట్టిన మీడియా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>