EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ntr19ca625d-b82f-4da2-a14e-eb6878c9877c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ntr19ca625d-b82f-4da2-a14e-eb6878c9877c-415x250-IndiaHerald.jpgభారత దేశంలో రాజకీయాలన్నీ కుటుంబ వారసత్వాలే. నెహ్రూ కుటుంబం నుంచి మొదలైన ఈ వారసత్వ సంపద.. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ పార్టీలకు వ్యాపించింది. బీజేపీకి వారసులు లేరంటారు కానీ.. బీజేపీ నేతలకు మాత్రం వారసులున్నారు. అయితే అధినేతలకు వారసులు లేకపోతేనే సమస్యలు మొదలవుతాయి, పార్టీలు రెండు మూడుగా విడిపోతాయి. ఒకవేళ వారసులున్నా ఎవరికి వారే రెండు మూడు పార్టీలు పెట్టి నడిపించుకుంటున్న ఉదాహరణలూ ఉన్నాయి. ntr{#}sanyasam;Telangana Chief Minister;Daggubati Venkateswara Rao;central government;Lakshmi Parvathi;politics;Bharatiya Janata Party;Lokesh;Lokesh Kanagaraj;harikrishnana;NTR;Success;Balakrishna;Y. S. Rajasekhara Reddy;Sharmila;Jagan;Congress;TDP;CBN;Partyవైయస్సార్ ఫ్యామిలీ హిస్సా సరే, మరి ఎన్టీవోడి కుటుంబ కథ..?వైయస్సార్ ఫ్యామిలీ హిస్సా సరే, మరి ఎన్టీవోడి కుటుంబ కథ..?ntr{#}sanyasam;Telangana Chief Minister;Daggubati Venkateswara Rao;central government;Lakshmi Parvathi;politics;Bharatiya Janata Party;Lokesh;Lokesh Kanagaraj;harikrishnana;NTR;Success;Balakrishna;Y. S. Rajasekhara Reddy;Sharmila;Jagan;Congress;TDP;CBN;PartyMon, 12 Jul 2021 10:00:20 GMTభారత దేశంలో రాజకీయాలన్నీ కుటుంబ వారసత్వాలే. నెహ్రూ కుటుంబం నుంచి మొదలైన ఈ వారసత్వ సంపద.. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ పార్టీలకు వ్యాపించింది. బీజేపీకి వారసులు లేరంటారు కానీ.. బీజేపీ నేతలకు మాత్రం వారసులున్నారు. అయితే అధినేతలకు వారసులు లేకపోతేనే సమస్యలు మొదలవుతాయి, పార్టీలు రెండు మూడుగా విడిపోతాయి. ఒకవేళ వారసులున్నా ఎవరికి వారే రెండు మూడు పార్టీలు పెట్టి నడిపించుకుంటున్న ఉదాహరణలూ ఉన్నాయి.

వైఎస్ఆర్ వారసత్వం ఎవరిది..?
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ తుదిశ్వాస విడిచారు. అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి, బయటికొచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. జగన్ తోపాటు వైఎస్ఆర్ కుటుంబమంతా వైఎస్సార్సీపీవైపే వచ్చింది. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టుకున్నారు. నీకీ రాష్ట్రం, నాకీ రాష్ట్రం అని స్పష్టంగా విభజించుకుని.. ఒకరి వ్యవహారాల్లో ఒకరు వేలు పెట్టకూడదని డిసైడ్ అయ్యారు. ఏపీలో జగన్ వైఎస్ఆర్ వారసుడిగా విజయవంతం అయితే, తెలంగాణలో విజయంకోసం షర్మిల ఎదురు చూస్తున్నారు. సో వైఎస్ఆర్ ఫ్యామిలీ రాజకీయాలు ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నాయి.

టీడీపీ వారసత్వం ఎవరిది..?
వైఎస్ఆర్ వారసత్వాన్ని కొడుకు, కూతురు సమంగా పంచుకున్నారు. తమదైన పంథాలో ముందుకెళ్తున్నారు. మరి
ప్రాంతీయ పార్టీల రాజకీయాలతో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి..? అలాంటి ఎన్టీఆర్ వారసత్వాన్ని కొడుకులు, కూతుళ్లు ఎందుకు తీసుకోలేకపోయారు. కనీసం ఒక్కరైనా పార్టీ అధినేతగా ఎందుకు మారలేకపోయారు?

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి సొంతగా రాజకీయాలు చేస్తుండే సరికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ వ్యవహారం తెరపైకి వచ్చింది. కనీసం షర్మిలపాటి ధైర్యం కూడా ఎన్టీఆర్ వారసులు ఎందుకు చేయలేకపోతున్నారనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి కుర్చీనుంచి దింపేసి, పార్టీని చంద్రబాబు హస్తగతం చేసుకున్న తర్వాత కాస్త అలజడి చెలరేగినమాట వాస్తవమే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అసలైన టీడీపీ మాదేనంటూ ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. కొన్నాళ్లకు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేరుపడ్డారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా అన్న టీడీపీ పేరుతో మరో పార్టీ పెట్టుకున్నారు. కానీ ఎక్కడా ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. ఎన్టీఆర్ కుమార్తె పురంధీశ్వరి కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్నా.. అది కాంగ్రెస్ చలవతో కానీ, టీడీపీ వల్ల కాదు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపుగా రాజకీయ సన్యాసం చేసినట్టే లెక్క. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా.. పార్టీ అధినేతగా మారేందుకు ఆయన ఇష్టపడరు, అల్లుడు లోకేష్ కి ఆ పదవిలో సక్సెస్ అయితే చాలనుకుంటారు.

వైఎస్సార్ కి అలా.. ఎన్టీఆర్ కి ఇలా..
ఎన్టీఆర్, వైఎస్ఆర్.. ఇద్దరూ జనాభిమానంలో ఎవరికి వారే సాటి. ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ ఇద్దరి వారసుల్లో ఎంతో తేడా. ఎన్టీఆర్ వారసులెవరూ పార్టీపై పట్టు పెంచుకోలేకపోయారు, అనివార్యంగా ఆ పార్టీని నారా వారి చేతుల్లో పెట్టేశారు. ఇటు వైఎస్ఆర్ వారసులు మాత్రం కాంగ్రెస్ కి ముచ్చెమటలు పోయించి ఒక్కొకరు ఒక్కో పార్టీ పెట్టి హవా చూపిస్తున్నారు.



ఆడియో కలకలం రచ్చ : టీఆర్ఎస్ టికెట్ నాకే అంటున్న కౌశిక్ రెడ్డి ?

జక్కన్న వరల్డ్ వైడ్ ప్లాన్.. దాన్ని గట్టిగా ప్లాన్ చేశాడే?

తమిళ హీరోతో జాతిరత్నాలు డైరక్టర్.. పాన్ ఇండియా మూవీ..!

బాబు మారలేదా..? ఈసారి మూడు కళ్ల సిద్ధాంతం..?

ఆమె ప్రయాణం అద్భుతం: సిఎం జగన్

సినీ పరిశ్రమలో సినిమాల రీమేక్ కొత్తేం కాదు. బాలీవుడ్ సినిమాలను టాలీవుడ్‌లో రీమేక్ చేయడం.. టాలీవుడ్ సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడం చూస్తూ ఉంటాం. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని సినీ రంగాల్లో సినిమాలు రీమేక్ అవుతుంటాయి.

బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ సినిమా రీమేక్.. హీరో కూడా కన్‌ఫార్మ్‌..!

బాబోరి రేవంత్ కు దేవుడిగా మారిన వైఎస్సార్ ?

పార్టీ అధ్యక్ష పదవి పట్ల రావుల చంద్రశేఖర్ రెడ్డి అంత ఆసక్తిగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైనా దూకుడుగా వెళ్లే నేతను ,అది కూడా యువకుడిని అధ్యక్షుడిగా పెడితే బాగుంటుందని ఆయన అంటున్నారట. టిడిపి అద్యక్షుడు ఎల్.రమణ రాజీనామాతో కొత్త అద్యక్షుడి ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టినా.. పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>