PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishnaa-jalaalapy-kcr-viswaroopam6dd35a6e-4e3f-4244-8722-9f1d746fc2a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishnaa-jalaalapy-kcr-viswaroopam6dd35a6e-4e3f-4244-8722-9f1d746fc2a4-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల జల వివాదంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. కృష్ణా జలాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకుంటున్నారు. దీనికోసం ఆయ‌న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. రెండు రాష్ట్రాల‌కు ఈ జ‌లాలు చెరిస‌గం అంటున్నారు. శ్రీశైలం నీటిని పంపిణీ చేస్తున్న పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్టు అని కేసీఆర్ తేల్చేశారు. రాయలసీమ ఎత్తిపోతలు కూడా అక్రమమేనని, దానిని కూడా అంగీకరించేది లేదంటున్నారు. ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి మ‌రీ కేసీPOLITICS;KCR{#}pragathi;Srisailam;Rayalaseema;contract;Andhra Pradesh;Aqua;Krishna River;KCR;Telugu;Telanganaకృష్ణా జ‌లాల‌పై కేసీఆర్ విశ్వ‌రూపం..?కృష్ణా జ‌లాల‌పై కేసీఆర్ విశ్వ‌రూపం..?POLITICS;KCR{#}pragathi;Srisailam;Rayalaseema;contract;Andhra Pradesh;Aqua;Krishna River;KCR;Telugu;TelanganaSun, 04 Jul 2021 18:45:00 GMT
తెలుగు రాష్ట్రాల జల వివాదంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. కృష్ణా జలాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకుంటున్నారు. దీనికోసం ఆయ‌న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. రెండు రాష్ట్రాల‌కు ఈ జ‌లాలు చెరిస‌గం అంటున్నారు. శ్రీశైలం నీటిని పంపిణీ చేస్తున్న పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్టు అని కేసీఆర్ తేల్చేశారు. రాయలసీమ ఎత్తిపోతలు కూడా అక్రమమేనని, దానిని కూడా అంగీకరించేది లేదంటున్నారు. ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి మ‌రీ కేసీఆర్ వ్యాఖ్యానించ‌డంతో భ‌విష్య‌త్తులో నీటి విష‌యంలో తెలంగాణ ఎలా వ్య‌వ‌హ‌రించ‌బోతోంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేస్తారు. డ్యాముల్లో ఉన్న నీటిలో పై శాతం ప్ర‌కారం  ఏపీకే కేటాయిస్తున్నారు. దీనివ‌ల్ల న‌ష్టం జ‌రుగుతోంద‌ని, ఈ ఒప్పందం త‌మ‌కు ఆమోద‌యోగ్యం కాద‌ని కేసీఆర్ అంటున్నారు. ఇద్ద‌రికీ స‌మానంగా నీటిని పంచాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 811 టీఎంసీల్లో చెరో 405.5 టీఎంసీలను వాడుకోవాల్సిందేనని స్ప‌ష్టం చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న వాద‌న స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తోంది. కృష్ణాకు నిల్వ చేసుకోలేనంత భారీ వరద వస్తేనే ఎగువ రాష్ట్రాలు దిగువకు వదులుతున్నాయి. దీనివ‌ల్ల కృష్ణా పరివాహకంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప‌రిస్థితులు ఇలావున్న త‌రుణంలోనే రాయలసీమకు కృష్ణా నీరు తాగు, సాగునీటికి ఉపయోగపడుతోంది. కృష్ణా డెల్టా అవసరాలను పట్టిసీమ ద్వారా తీర్చాల‌ని, అనంత‌రం మిగిలిన నీటి శ్రీ‌శైలంద్వారా రాయ‌ల‌సీమ‌కు తీసుకువెళ్లాల‌ని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు కేసీఆర్ పోతిరెడ్డిపాడుకే ఎస‌రు పెడుతున్నారు. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ చేస్తాన‌న్న కేసీఆర్ ఇప్పుడు చుక్క నీరు కూడా సీమ‌కు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇలాంటి సంద‌ర్భాన్ని స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యారు. దీంతో రాయ‌ల‌సీమ‌కు నీటిగండం పొంచివుంద‌నే అభిప్రాయాల‌న్ని జ‌ల‌వ‌న‌రుల నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు.



కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు కేసీఆర్ ముహూర్తం.. అవుట్‌... ఇన్ లిస్ట్ ఇదే..

అప్పట్లో వివాదాలను సృష్టించిన సినిమాను వదులుకున్న హీరో ఎవరో తెలుసా ?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖ‌ర్చు రు. 300 కోట్లు ?

జ‌గ‌న్‌కు మాయ‌రోగం, మ‌తిమ‌రుపు..?

బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన రవితేజ హీరోయిన్..!

ఉత్త‌రాఖండ్ నుంచి బెంగాల్ రాజ‌కీయం..?

బ్రేకింగ్ : కేఆర్ఎంబికి తెలంగాణ లేఖ

జ‌గ‌న్‌పై జ‌డ్జి రామ‌కృష్ణ ధ్వ‌జం.. మ‌తిమ‌రుపు.. మాయ‌రోగం అని సెటైర్లు

న‌వంబ‌ర్ లోపు ఉప ఎన్నిక‌లు లేక‌పోతే సీఎం ప‌ద‌వికి మామ‌త రాజీనామాయే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>