BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag55a67a47-2e09-4b58-9a88-d450510efc5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag55a67a47-2e09-4b58-9a88-d450510efc5e-415x250-IndiaHerald.jpgభార‌త‌దేశంలో రోజురోజుకూ విశ్వ బికారిగా మారిపోతోందంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశంలో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. ఐదు ట్రిలియ‌న్ డాల‌ర్ట‌ల వ్యాపార సామ‌ర్థ్యంతో భార‌త‌దేశం విశ్వ‌గురు స్థానానికి చేరుకుంటోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ ఇందుకు విరుద్ధంగా భార‌త్ విశ్వ‌బికారిగా మారిపోతోందంటూ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు సునీల్ జ‌ఖ‌ర్ వ్యాఖ్యానించారు. ప్ర‌తి దేశానికి సాయం చేసే స్థితి నుంచి ప్ర‌తి దేశం నుంచి సాయం తీసుకుంటోంద‌ని, ఇత‌ర దేశాల నుంచి మెడిక‌ల్ ఆక్సిజ‌న్ తీసుకొనిtag{#}sunil;vishwa;Congress;central government;Punjab;Partyవిశ్వ‌బికారిగా భార‌త్‌?విశ్వ‌బికారిగా భార‌త్‌?tag{#}sunil;vishwa;Congress;central government;Punjab;PartyFri, 25 Jun 2021 16:12:04 GMT
భార‌త‌దేశంలో రోజురోజుకూ విశ్వ బికారిగా మారిపోతోందంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశంలో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. ఐదు ట్రిలియ‌న్ డాల‌ర్ట‌ల వ్యాపార సామ‌ర్థ్యంతో భార‌త‌దేశం విశ్వ‌గురు స్థానానికి చేరుకుంటోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ ఇందుకు విరుద్ధంగా భార‌త్ విశ్వ‌బికారిగా మారిపోతోందంటూ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు సునీల్ జ‌ఖ‌ర్  వ్యాఖ్యానించారు. ప్ర‌తి దేశానికి సాయం చేసే స్థితి నుంచి ప్ర‌తి దేశం నుంచి సాయం తీసుకుంటోంద‌ని, ఇత‌ర దేశాల నుంచి మెడిక‌ల్ ఆక్సిజ‌న్ తీసుకొని వ‌స్తోన్న విమానాల‌నుబ‌ట్టి మ‌నం ఏ స్థాయిలో ఉన్నామో తెలిసిపోతోంద‌న్నారు. సునీల్ జ‌ఖ‌ర్ వ్యాఖ్య‌ల‌పై కొంత‌మంది అనుకూలంగా, మ‌రికొంద‌రు వ్య‌తిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు భార‌త‌దేశ ఆర్థిక‌స్థితిని, న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయిన‌త‌ర్వాత దిగ‌జారుతున్న ఆర్థిక ప‌రిస్థితిని పోల్చి చూస్తే సునీల్ చెపుతున్న‌వి వాస్త‌వ‌మేనంటున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా రోజురోజుకు పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు.



మందు మానేసినట్టు ప్రకటించిన తారలు

రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఈడీ ఎదుట విచారణకు హాజ‌ర‌వ‌లేదు. స‌మ‌యం కావాలంటూ ఎంపీ కోర‌డంతో మ‌రోసారి స‌మ‌న్లు జారీచేయాల‌ని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ నిర్ణ‌యించింది. 1,064 కోట్ల రూపాయల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి ఎంపీ నామా, రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో గ‌త శుక్రవారం త‌నిఖీలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

హాజ‌రు కాకుండా త‌ప్పించుకున్న ఎంపీ?

అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

జమ్మూ కశ్మీర్‌కు మొదట రాష్ట్ర హోదాను ప్రకటించాల‌ని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాతే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరారు. అటువంటిదేమీ లేకుండా ముందు ఎన్నిక‌లు నిర్వ‌హించి త‌ర్వాత హోదా ఇస్తామ‌న‌డం వింతంగా ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు కశ్మీర్ నేత‌ల మాట‌కూడా మందుగా హోదా ప్ర‌క‌టించాలనేన‌ని స్ప‌ష్టం చేశారు. గుర్రాన్ని ముందుపెట్టి బండి వెన‌క ఉంటే గుర్రం బండి లాగుతుంది..

ముందు ఇచ్చి మాట్లాడితే మంచిది?

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్ మెంట్ ..!

ఏపీలోని క‌రోనాకు మందు అంద‌జేస్తోన్న ఆనందయ్యను మద్రాసు హైకోర్టు అభినందించింది. కరోనాకు ఉచితంగా మందు త‌యారుచేసి ఇవ్వ‌డంపై అభినంద‌న‌లు తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌. కరుబాకరణ్‌, టీవీ తమిళ్ సెల్వీ ఈ సంద‌ర్భంగా ఆనంద‌య్య‌కు సెల్యూట్ చేశారు. డీఆర్డీవో 2-డీజీ మందు విచారణకు వ‌చ్చిన‌ సందర్భంగా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌వ‌ద్ద ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది.

ఆనంద‌య్య‌కు హైకోర్టు న్యాయ‌మూర్తుల సెల్యూట్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>