PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bandi-sanjaya078989e-b46d-42c4-8755-a1d196d53973-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bandi-sanjaya078989e-b46d-42c4-8755-a1d196d53973-415x250-IndiaHerald.jpgకేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో బీజేపీ నేతలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో ఏపీలో ఒక్కశాతం ఓట్లు రాకపోయిన సరే, తామే జగన్‌కు అసలైన ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మొదట్లో వరుసపెట్టి టీడీపీ నేతలకు కాషాయ కండువా కప్పుతూ, ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ స్థానంలోకి బీజేపీ వస్తుందని ప్రకటించేశారు.bandi sanjay{#}KCR;Somu Veerraju;Janasena;Bank;Bharatiya Janata Party;CBN;TDP;Success;Andhra Pradesh;Hanu Raghavapudi;Congressసంజయ్‌లాగా సోము రీప్లేస్ చేయలేకపోతున్నారే..!సంజయ్‌లాగా సోము రీప్లేస్ చేయలేకపోతున్నారే..!bandi sanjay{#}KCR;Somu Veerraju;Janasena;Bank;Bharatiya Janata Party;CBN;TDP;Success;Andhra Pradesh;Hanu Raghavapudi;CongressThu, 24 Jun 2021 12:00:00 GMTకేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో బీజేపీ నేతలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. గత ఎన్నికల్లో ఏపీలో ఒక్కశాతం ఓట్లు రాకపోయిన సరే, తామే జగన్‌కు అసలైన ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మొదట్లో వరుసపెట్టి టీడీపీ నేతలకు కాషాయ కండువా కప్పుతూ,  ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ స్థానంలోకి బీజేపీ వస్తుందని ప్రకటించేశారు.


అయితే ఈ రెండేళ్లలో టీడీపీ స్థానం అలాగే ఉంది. అలాగే బీజేపీ స్థానం కూడా ఇంకా నోటా ఓట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ పార్టీకి ఏ మాత్రం ఓటు బ్యాంక్ పెరగలేదు. గత ఎన్నికల్లో నోటా దాటి ఓట్లు తెచ్చుకోలేని బీజేపీ, ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే పెద్దగా ప్రయోజనం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన ఓట్లే కాస్త తగ్గాయని చెప్పొచ్చు.


అసలు ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఏ మాత్రం సత్తా చాటలేకపోతున్నారని తెలుస్తోంది. పైగా ఏపీ బీజేపీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొందరు జగన్‌కు మద్ధతుగా ఉంటే, మరికొందరు  చంద్రబాబుకు మద్ధతుగా ఉన్నారు. సోము సైతం జగన్‌కు మద్ధతుగా ఉన్నారనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీని వల్ల ప్రజలు సైతం బీజేపీ వైపుకు రావడం లేదు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రానికి పెద్దగా న్యాయం చేయట్లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. హోదా, ఇతర విభజన హామీలని బీజేపీ అమలు చేయడం లేదు. అందుకే ఇంకా ఏపీ ప్రజలు బీజేపీని నమ్మట్లేదు.


అయితే తెలంగాణలో బీజేపీ పరిస్తితి చాలా మెరుగ్గా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్‌గా రాజకీయం చేస్తూ, బీజేపీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని రీప్లేస్ చేయగలిగారు. ఇప్పుడు కేసీఆర్‌కు బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధిగా నిలబెట్టడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని రీప్లేస్ చేయడంలో సోము ఫెయిల్ అయ్యారు.




వెంకటేష్, పవన్ ల సక్సెస్ ఫార్ములా వాడబోతున్న రాజశేఖర్!!

ఓడిన టీమిండియాకు 5.84 కోట్ల ప్రైజ్ మనీ.. మరి న్యూజిలాండ్ కు ఎంతంటే?

హుజురాబాద్ లో త్రిముఖ పోరు ఉండనుందా..?

గత కొన్నిరోజులుగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో అశోక్ గజపతి రాజు, వైసీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ బాధ్యతలు తీసుకోవాలని చెబుతూ, సంచయితని ఛైర్మన్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. కానీ దీనిపై మళ్ళీ కోర్టుకెళ్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అలాగే అశోక్ పెద్ద దొంగ అని, మాన్సాస్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని మాట్లాడారు.

ఆ టీడీపీ ఎమ్మెల్యే రివర్స్ అయ్యారుగా!

రాహుల్ కి ఇంట్రెస్టింగ్ గిఫ్ట్.. ఏకంగా పులిపిల్ల!

ఆనంద భాష్పాలు ఆపుకోలేకపోయిన న్యూజిలాండ్ సీనియర్

బ్రేకింగ్: ఏపీలో పరిక్షలు రద్దు అవుతాయా...?

ఇది చిరంజీవి మార్కు రాజ‌కీయం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>