PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-ysrcp-tdp6329cef6-02a9-4c72-b631-0c78d31c3422-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-ysrcp-tdp6329cef6-02a9-4c72-b631-0c78d31c3422-415x250-IndiaHerald.jpgనియోజకవర్గ ఇంఛార్జ్ లు, ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ...సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి మోసం చేస్తున్నార‌ని అన్నారు. ఇచ్చింది గోరంత అయితే దోచింది కొండంత అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అవినీతిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు జ‌ర‌గాల‌ని చెప్పారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ లో ప్ర‌భుత్వం ఘోరంగా విఫలమ‌య్యింద‌న్నారు. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు వేసి ప్రచారం చేసుకుంటున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి cm jagan{#}DWCRA;marijuana;job;TDP;Jagan;Coronavirus;CBNజ‌గ‌న్ రెడ్డి ఇచ్చింది గోరంత‌..దోచింది కొండంత : చంద్రబాబుజ‌గ‌న్ రెడ్డి ఇచ్చింది గోరంత‌..దోచింది కొండంత : చంద్రబాబుcm jagan{#}DWCRA;marijuana;job;TDP;Jagan;Coronavirus;CBNTue, 22 Jun 2021 16:43:09 GMTనియోజకవర్గ ఇంఛార్జ్ లు, ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ...సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి మోసం చేస్తున్నార‌ని అన్నారు. ఇచ్చింది గోరంత అయితే దోచింది కొండంత అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అవినీతిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు జ‌ర‌గాల‌ని చెప్పారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ లో ప్ర‌భుత్వం ఘోరంగా విఫలమ‌య్యింద‌న్నారు. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు వేసి ప్రచారం చేసుకుంటున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిత్యం అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండ‌ర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్య‌క్తమ‌వుతోంద‌న్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. ధాన్యం బకాయిలు చెల్లించలేదు, పంటలకు గిట్టుబాటు ధర లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేప్ లు, సెటిల్ మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ లు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమిళనాడులో సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని సలహాదారులగా పెట్టుకున్నారుని...ఏపీలో అసమర్థులను సలహాదారులుగా పెట్టుకున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కలకంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. చేయూత పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామనే హామీ ఏమైంది? అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఏడాదికి రూ.36వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1,80,000 చెల్లించాలంటూ చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

 
లబ్ధిదారుల ఎంపికలో కూడా పెద్ద ఎత్తున కోత విధించారని వ్యాఖ్యానించారు. 4 ఏళ్లకు పరిమితం చేసి.. కొంతమందికి మాత్రమే ఏడాదికి రూ.18వేలు చెల్లిస్తుంద‌ని అన్నారు. అంటే ఒక్కో మహిళకు రూ.లక్షా 5వేలు ఎగనామం పెట్టి వంచించారని అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేశార‌న్నారు. ఈ నెల 29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన కార్యక్రమం చేప‌ట్టాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి ఇంటి సమీపంలో యువతిపై దారుణ అత్యాచారం జ‌ర‌గ‌ట‌మే శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమ‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.



పచ్చి టమోటాలు తింటున్నారా ? వామ్మో ఇది చూడాల్సిందే..

ఆర్ఆర్ఆర్: స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్..!

టాలీవుడ్ ని కరోనా కరుణించినట్టేనా..?

టెన్షన్ లో టాలీవుడ్.. కరుణిస్తారా?

ప్రపంచమంతా అప్పులు చేస్తోంది...మేమొక్కరమేనా?

కరోనాతో మావోయిస్ట్ అగ్ర నేత మృతి...?

ఒలింపిక్స్ కు వెళ్ల‌నున్న జ‌గ‌న్‌?

'చరణ్' విషయంలో అప్సెట్ అయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

బ్రేకింగ్: ఇల్లు జగనన్న కట్టించట్లేదా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>